18, మార్చి 2023, శనివారం

YCP ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక తీర్పు: CPM

 YCP ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక తీర్పు

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు   

                         


     శాసన మండలి ఎన్నికల్లో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో విద్యావంతులు వైసిపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సిపిఎం స్వాగతిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు.                 

      ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి రాష్ట్ర ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించడం మొదలు డబ్బు వెదజల్లడం, అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు వేయించడం వరకు అధికార వైసిపి పార్టీ అనేక అక్రమాలకు పాల్పడినా వారికి పరాజయం తప్పలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర శ్రమ జీవుల సమస్యలను పరిష్కరించలేదు సరికదా వారు సాగించిన ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం విధించింది. ప్రభుత్వ తీరుకు ప్రతిఘటనే పట్టభద్రుల తాజా తీర్పు. ప్రభుత్వ విధానాలకు నిరసనగాను, వాటికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమాల కొనసాగింపుగానే  పట్టభద్రులు ఓటును వినియోగించారు.

     రానున్న రోజుల్లో మరిన్ని ఐక్య ఉద్యమాలను నిర్వహించి ప్రజాసమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం మెడలు వంచాలి. అన్ని వర్గాలు, తరగతుల ప్రజానీకం పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలపై పునరాలోచించి, ప్రజానుకూల చర్యలు చేపట్టాలని, నిర్బంధ వైఖరిని విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *