అసంతృప్తి, రెబల్ MLAలతో అధికార పార్టీ నేతల్లో కలవరం
రేపు APలో MLA కోటా MLC ఎన్నికలు
అసంతృప్తి, రెబల్ ఎమ్మెల్యేలతో అధికార పార్టీ నేతల్లో కలవరం
ఏపీలో రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎన్నికలపై అధికార ప్రతిపక్ష పార్టీలు దిశా నిర్దేశం చేసాయి. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 3కి 3 స్థానాలు అధికార పార్టీ చేజార్చుకున్న వైనంతో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకంగా మారాయి. అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానున్నారు. అసంతృప్తి ఎమ్మెల్యేలను మంత్రులు బుజ్జగిస్తున్నారు. కీలక ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక్కొక్కరికి 22 మంది సభ్యులను అప్పగించారు. అప్పగించిన సభ్యులు ఓటు వేసే బాధ్యత మంత్రులదే అని చెప్పిన సీఎం జగన్. రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా నాలుగు సార్లు మాక్ పోల్ నిర్వహణ. నాలుగు సార్లు కూడా తప్పులే జరిగాయి అని సమాచారం. మరో సారి ఎలా ఓటు వెయ్యాలి అని ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్న మంత్రులు, పార్టీ కీలక నేతలు. విజయవాడలో పలు చోట్లా ఎవరికి కేటాయించిన గ్రూప్ సభ్యులతో వారు విడివిడిగా సమావేశాల నిర్వహణ. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో రాష్ట్రంలో మరింత హీట్ పెరిగింది.