25, మార్చి 2023, శనివారం

విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

                               విద్యార్థులు  డ్రగ్స్ కు దూరంగా ఉండాలి


            విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ  సహాయ సంచాలకులు వై. శ్రీనివాస్ అన్నారు.  శనివారం ఉదయం ప్రిన్సిపాల్ ఆనంద రెడ్డి తో కలసి స్థానిక  పి. వి. కె. ఎన్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు  అధ్యాపకులకు విద్యార్థులకు డ్రగ్స్ నివారణ, ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలు, నష్టాలు పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

       


   ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత చదువుపై శ్రద్ధ పెట్టాలని, డ్రగ్స్ కు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు,  యువత కి జీవితంలో ముఖ్యమైందని టినేజ్ ని బాగుపడాలన్న చెడిపోవాలన్న టీనేజ్ లో వారు చేసే పనుల్లో వారి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. చెడ్డ వారితో స్నేహం చేయడం వల్ల జీవితం పతనమవుతుందని, అదే మంచి వారితో స్నేహం చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు.  తల్లిదండ్రులకు, దేశానికి యువత సంపద కావాలే కానీ, భారం కాకూడదన్నారు. డ్రగ్ ఉపయోగించడం వల్ల సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా మానసికంగా, శారీరకంగా ఆ కుటుంబం అంతా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. డ్రగ్స్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు పై చుట్టుపక్క ప్రాంతాల్లోని యువతకు ప్రజల కు అవగాహన కలిగించాలన్నారు. డ్రగ్స్ కు సంబంధించి సమాచారం తెలిసిన వెంటనే 14500 నెంబరుకు ఫోన్ చేయాలని విద్యార్థుల కు చూచించారు.

        అంతకు ముందు  డ్రగ్స్ ను మేము వాడము, డ్రగ్స్ ను ఎవ్వరిని వాడనీయము, డ్రగ్స్ లేని జిల్లాకు మా వంతు  సహాయం చేస్తామని ప్రిన్సిపాల్ ఆనంద రెడ్డి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఎస్ వి ఆర్ ఆర్ ఆసుపత్రి , రాస్,పాస్ స్వచ్చంధ సంస్థలు నుంచి వచ్చిన ముకుందమ నాయుడు,కవిత,విభిన్న ప్రతిభావంతుల కార్యాలయపు సీనియర్ సహాయకులు,వినోద్ కుమార్,రామచంద్ర,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు,యన్ జి ఓ లు తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *