శ్రీరామ నామం - సకల పాప హరణం
శ్రీరామ (Sri Rama) నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. శ్రీరాముడు (Sri Ramudu) సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం!! ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయాలు నెలకొని ఉన్నాయి. రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి (Srirama Navami) పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. హిందువులకు ఆరాధ్యదైవం శ్రీరాముడు. దేశములో రాముడి గుడి లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. శ్రీరామ నవమి వస్తుందంటే చాలు ఊరువాడా సందడే సందడి.
శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చిత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఈరోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈరోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీ రాముడి జన్మదినమైన ఛైత్రశుద్ధ నవమిని హిందువులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. రాముడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తుల నమ్మకం. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి రోజున అంగరంగ వైభవంగా సీతాముల కళ్యాణం జరుపుతారు. ఈ రోజు పానకం, వడపప్పు పంచిపెడతారు.
పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవారు. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని కొంతమంది చెబుతారు. ఆ సమయంలో సూర్యుడు అత్యంత ప్రకాశంవతంగా కనిపించడాని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ రాముడు పితృవాక్యపరిపాలకుడు. తన తండ్రి మాటను జవదాటేవాడే కాదు. తండ్రిచ్చిన మాటకు కట్టుబడి సతీమేతంగా, సోదరుడి లక్ష్మణుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం చేశాడు. రామ బాణానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇది ఎంతో శక్తివంతమైంది. ఒక్కసారి సంధిస్తే అది రాజ్యంలోని మొత్తం సైన్యాన్ని సమూలంగా సంహరించగలదు.
సీతమ్మను అపహరించిన రావణుడిని యుద్ధంలో సంహరించిన పిమ్మట తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడవుతాడు శ్రీరాముడు. అనంతరం 11 వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించడానికి నమ్ముతారు. సంపూర్ణ శాంతి, శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. శ్రీ రామ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఆ రోజే జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు.
శ్రీరామ నవమి రోజున వేకువజామునే నిద్ర లేచి శుచిగా స్నానమాచరిస్తారు దేవుడు మందిరం శుభ్రం చేసుకున్నాక దీపారాధన చేస్తారు. అలానే శ్రీ రామునికి పండ్లు, తులసి ఆకులని, పూలని, ప్రసాదాన్ని అర్పిస్తారు. నవమి రోజున దేశంలో రామాలయం ఉన్న ప్రాంతాల్లోనే కాదు.. ఊరువాడా కూడా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. వడపప్పు, పానకం రాములవారి కల్యాణానికి ప్రసాదం గా పెట్టి అందరికీ నైవేద్యంగా పంచిపెడతారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కొరలు చాచిన నేపథ్యంలో ఇంట్లో ఉండే పండుగ చేసుకోవడమే శ్రేయస్కరం.
ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలుగు ప్రజలు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.
శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం! శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది.