నీవా నదిని పరిశీలించిన మంత్రి అంబంటి రాంబాబు
నీవా నదిని పరిశీలించిన మంత్రి అంబంటి రాంబాబు
జలవనరుల శాఖ మంత్రి అంబంటి రాంబాబు (Ambati Rambabu) బుధవారం చిత్తూరులోని నీవనదిని పరిశీలించారు. చిత్తూరు MLA శ్రీనివాసులు మాట్లాడుతూ.. వరదలు వచ్చినప్పుడు నీవానది చుట్టూ ఉన్న నివాసాలు జలమయంగా మారుతున్నాయని చెప్పారు. నీవానది చుట్టూ 11 కిలోమీటర్లు రక్షణ గోడలు, కల్వర్టు, చెక్ డ్యాం, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించాలని గతంలో సీఎంకు ప్రతిపాదనల ద్వారా వినతి చేసిన విషయాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రికి గుర్తు చేశారు. దీని పై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలను సాధ్యమైనంత త్వరలో అమలు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి హామీనిచ్చారు. చిత్తూరులోని ఎమ్మెల్యే నివాసంకు వచ్చి తేనేటి విందును సేవించి ముచ్చటించారు.