APలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా ?
APలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా ?
జగన్ హస్తిన పర్యటనలు అందుకేనా ?
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఎప్పుడనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో చెల్లించలేని దుస్థితి. రాజకీయంగా కూడా పరిస్థితి అడుపుతప్పుతోంది. పట్టభద్రుల MLC ఎన్నికల్లో తెదేపా విజయకేతనం ఎగురవేసింది. MLAల కోటా MLC ఎన్నికలలో కూడా ఉహించని విధంగా తెదేపా అభ్యర్థి గెలుపొందారు. నలుగురు MLAలను YSR కాంగెస్ పార్టీ సస్పెండ్ చేసింది. రోజుకో MLA నిరసన గళం వినిపిస్తున్నారు. ఒక వైపు చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్రకు మంచి స్పందన వస్తుంది.
ఈ నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని CM Jagan Mohan Reddy భావిస్తున్నారని జోరుగా ఉహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తరువాత దీనిపై ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం ఇదే.. ప్రస్తుతం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. ఇదే విషయంపై ప్రధాని మోదీతో చర్చిస్తారని వైసీపీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీలో ఇదే అంశంపై మాట్లాడే అంశం ఉండొచ్చు అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లో ఎన్నికలు ఉన్నాయి. ఇవి రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణతో పాటు.. ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఉంది.
CM Jaganకు, కేంద్రంలోని Modi ప్రభుత్వానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల విషయంపై మోదీని ఒప్పించాలనేది సీఎం జగన్ ప్లాన్.. అందుకే ఆయన హఠాత్తుగా.. ఢిల్లీకి వెళ్లారన్నది వైసీపీ వర్గాల టాక్. సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందంగా ఉన్నారని జగన్ భావిస్తున్నా.. ముందస్తు ఎన్నికలు కోరుకోవడానికి చాలాకారణాలే ఉన్నాయి అంటున్నారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రానికి నిధుల సమస్య వెంటాడుతోంది. కేంద్రం నుంచి నిధుల రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం కూడా కష్టమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా పథకం నిలిచిపోయానా.. కాస్త వాయిదా పడినా ఆయా వర్గాల్లో వ్యతిరేక భావన పెరిగే ప్రమాదం ఉంది. ఈ కష్టాలు అవసరం లేదు అనుకుంటే..? ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే బెటర్ అని సీఎం జగన్ అంచనాకు వచ్చారని ఒక ప్రచారం జరుగుతోంది. అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ననిలిచిపోక ముందే ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ప్లాన్గా ఉందని కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది.
దీనికి తోడు ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈజీగా గెలుస్తామని వైసీపీ లెక్కలు వేసుకుంది. కానీ అనూహ్యంగా పోటీలోనే లేదు అనుకున్న తెలుగు దేశం పార్టీ మూడింటికి మూడు స్థానాల్లో గెలుపొందింది. అంటే యువత.. చదుకున్న వారిలో జగన్ పాలనపై వ్యతిరేకత ఉందని వైసీపీ వర్గాలకు లెక్కలు వేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంత ఓటర్లలో కూడా వ్యతిరేకత మొదలైతే మొదటికే ప్రమాదం వస్తుంది. అందుకే ముందస్తుకు వెళ్లడమే మేలనే ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నాయని.. అదే విషయంపై ప్రధానితో పాటు, అమిత్ షాతో చర్చిస్తారనే ప్రచారం ఉంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం.. అలాంటి చర్చ ఏమీ లేదని అంటున్నారు. కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. ఏపీకి రావాలిసిన బకాయి నిధులు.. ఇతర ప్రాజెక్టులపై చర్చించేందుకే ఢిల్లీ వెళ్లారని చెబుతున్నాయి. అయితే YCP వర్గాల మాటలను ప్రజలు నమ్మడం లేదు. ఎదో జరుగుతుందని అందరు భావిస్తున్నారు. ఆ ఎదో ముందస్తు ఎన్నికలు అని కూడా అంటున్నారు.