వివాహిత అనుమానాస్పద మృతి
వివాహిత అనుమానాస్పద మృతి
పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లి లో చంద్రకళ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గంగాధర నెల్లూరు మండలం అగ్రహారం దళితవాడ చెందిన చంద్రకళ, పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లికి చెందిన సాయికుమార్ గత ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికీ చంద్రకళకు ఇద్దరు పిల్లలు. చంద్రకళను వరకట్నంతో వేధించేవాడని బంధువుల ఆరోపిస్తున్నారు. చంద్రకళ తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పెనుమూరు పోలీసులు తెలిపారు.