వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతి
వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతి
జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిమ సరైన అందక మృతి చెందిన సంఘటన మదనపల్లిలో జరిగింది. ఈ హృదయవికారమైన సంఘటన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. మృతురాలు మదనపల్లి రూరల్ తుర్కపల్లి కి చెందిన రుక్సానా. 25 సంవత్సరాలు. మూడో కాన్పు నిమిత్తం ఆసుపత్రిలో చేరింది. కాన్పు సమయంలో సరైన వైద్యం అందాకా గర్భిణీ మృతి చెందింది. కడుపులోనే బిడ్డ మృతి చెందడంతో, రక్తంలో ఉమ్మనీరు కలిసిపోయి రుక్సానా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు.