6, మార్చి 2023, సోమవారం

భారీగా తగ్గనున్న బంగారు ధరలు

     


ఒరిస్సాలో అత్యంత భారీగా బంగారు నిల్వలు

ప్రపంచంలో ఎక్కడా లేనంతగా నిల్వలు  
భారీగా తగ్గనున్న బంగారు ధరలు 
సామాన్యులకు అందుబాటులోకి  బంగారం 
అత్యంత సంపన్న దేశంగా ఆవిర్భవించనున్న భారత్ 

      జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) సర్వేలో ఒడిశాలోని మూడు జిల్లాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. దేవ్‌ఘర్‌, కియోంఝర్‌, మయూర్‌భంజ్‌లలో బంగారం నిల్వలున్నాయని రాష్ట్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి ప్రఫుల్ల మల్లిక్‌ ప్రకటించారు. దీంతో దేశం ఒక్కరి ఉలిక్కి పడింది. ప్రస్తుతం మన దేశం బంగారాన్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఒరిస్సాలోని బంగారం నిల్వలతో భారత దేశం అత్యంత సంపన్న దేశాంగా మరనుంది. ఆ నిల్వలు వెలికి తీస్తే దేశంలో బంగారు ధరలు ఘననీయంగా తగ్గనున్నాయి. బంగారు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మనం ఇతర దేశాలకు బంగారు ఎగుమతి చేయవచ్చు. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి ఘననీయంగా పెరగనుంది. భారత దేశం ప్రపంచలోనే అత్యంత ధనిక దేశంగా  అభివృద్ది చెందనుంది.

        ఈ మూడు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని  మంత్రి  ప్రకటన చేయడంతో కియోంఝర్, మయూర్‌భంజ్, డియోగఢ్ వాసులు ఆశ్చర్యపోయారు.   మూడు జిల్లాల్లో బంగారం ఉందని మంత్రి అనడం ఒడిశా ప్రజల్లో కొత్త ఆశను నింపింది. వాస్తవానికి, 1980లలో కియో ఝర్ జిల్లాలో బంగారు వనరుల కోసం మొదటి సర్వే జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఆ సమయంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కియోంజర్ జిల్లా బనాసపాల్ బ్లాక్‌లోని తారమాకాంత్,  నాయకోట్ పంచాయతీల పరిధిలోని కుశల, గోప్పూర్,  జలరుహ గ్రామాలలో సర్వే నిర్వహించింది. అయితే సర్వే ఫలితాలు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఆ తర్వాత, 2021–2022లో, GSI కియో ఝర్ జిల్లాలోని ఆ ప్రాంతాల్లో అత్యంత తాజా సాంకేతికతను ఉపయోగించి మరొక అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ సమయంలో సర్వే ఫలితాల గురించి GSI అధికారులు మౌనంగా ఉన్నారు.  


     ఒడిశాలోని డియోఘర్, కియోంజర్, మయూర్‌భంజ్‌తో సహా మూడు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఉక్కు, గనుల శాఖ మంత్రి ప్రఫుల్ల కుమార్ మల్లిక్ రాష్ట్ర అసెంబ్లీకి తెలియజేశారు. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) ప్రాథమిక సర్వే నిర్వహించి అదాస్ ఏరియా డియోగర్, గోపూర్, ఘాజీపూర్, సకల, అడాల్, స లైకానా, దిమిరిముండా, తదితర ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.   

     ఒడిశాలోని మూడు జిల్లాలోని వివిధ ప్రదేశాలలో బంగారం డిపాజిట్లు కనుగొన్నారు. మయూర్‌భంజ్ జిల్లాలోని జాషిపూర్, సురియాగూడ, రువాన్సీ, లాడెల్‌కుచా, మారేడిహి, సులేపట్,  బాదం పహాడ్ ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. అడాస్ ప్రాంతంలోని జీ2 లెవెల్‌లో రాగి ఖనిజంలో 1685 కిలోల బంగారం ఉన్నట్లు జీఎస్‌ఐ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ప్రాంతంలోని రాగి ఖనిజంలో 6.67 మిలియన్ టన్నుల రాగి, 0.638 మిలియన్ టన్నుల వెండి, 0.10 మిలియన్ టన్నుల నికెల్ ఉన్నట్లు అంచనా. 

     సర్వేలో, 1977-83 మరియు 1989-96 మధ్య స్టేట్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరేట్ నిర్వహించిన సర్వేలో గోపూర్ ప్రాంతంలో రెండు బంగారాన్ని మోసుకెళ్లే క్వార్ట్జ్ సిరలు  కనుగొన్నారు. గోపూర్ మరియు సలై కానా ఏరియా యొక్క దక్షిణ వైపు ఉన్న క్యూజోన్ సిరలోని సలైకానాలో కూడా బంగారం ఉనికిని కనుగొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *