14, ఫిబ్రవరి 2024, బుధవారం

తంబళ్ళపల్లి టీడీపీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్

 


తంబళ్ళపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఖరారు ఆయినట్లు విస్వసనియంగా తెలిసింది. ఈ మేరకు జిల్లాకు చెందిన ఒక ముఖ్యనేతతో చంద్రబాబు సమాలోచనలు జరిపి, తన నిర్ణయం వెల్లడించినట్లు సమాచారం. ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. తెదేపా నాయకులు ప్రవీణ్ తో చర్చలు జరుపుతున్నారు. తొందరనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 9 సార్లు ఎన్నికలు జరగ్గా 4 సార్లు తెదేపా విజయం సాధించింది. 2 సార్లు కాంగ్రెస్, మరో రెండు సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించగా, ఒక సారి వైసిపి గెలుపొందింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొదటి నుంచి అనిపిరెడ్డి లక్ష్మీదేవమ్మకు తెలుగుదేశం పార్టీలో గట్టిపట్టు ఉంది. ఆమె 1985, 1994 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష్మీదేవమ్మ కుమారుడు అనిపిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తన పదవీ కలం ఉండగానే, పార్టీ వదలి YSR కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ను బీసీ వర్గాలకు చెందిన శంకర్ యాదవ్ కు ఇవ్వడంతో, ప్రవీణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకర్ మీద పోటీచేసి ఒతిపోయారు. శంకర్ నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో తిరిగి నవీన్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆయన కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటేవల తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోని వచ్చి, పోటి చేయించే భాద్యత పీలేరు కు చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి నల్లారి కిశోర్ రెడ్డికి అప్పగిమ్చినట్లు తెలిసింది.


తంబళ్లపల్లె నియోజకవర్గం కింద తంబళ్లపల్లి, మొలకలచెరువు, పెద్దమాండెం, కురుపులకోట,  బీ. కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం మండలాలు వస్తాయి. నియోజకవర్గంలో గెలుపు వివరాలను పరిశీలిస్తే 1983లో టిఎన్ శ్రీనివాసులు రెడ్డి, 1985లో లక్ష్మీ దేవమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 1989 లో జరిగిన ఎన్నికల్లో కడప ప్రభాకర్ రెడ్డి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తిరిగి లక్ష్మీ దేవమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప ప్రభాకర్ రెడ్డి సాధించారు. 2009 ఎన్నికలలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, 2014 ఎన్నికలలో శంకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019 ఎన్నికలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో ద్వారక నాగరెడ్డి స్థానికేతరులైన తంబళ్లపల్లి ఓటర్లు ఆదరించారు.


BC సామాజిక వర్గానికి చెందిన G. శంకర్ యాదవ్ 2014 ఎన్నికలలో శంకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019 ఎన్నికలలో మళ్ళి పోటి చేసినా, YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వరకనాధ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కొంత విరామం తరువాత శంకర్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. శంకర్ నివాసం బెంగళూరులో ఉంటున్నారు. వ్యాపారవేత్త. నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది. అందుకే చాలా రోజులు తంబళ్ళపల్లి నియోజక వర్గానికి ఇంచార్జి లేకుండా ఖాలిగా ఉండింది. గత ఏడాది తిరిగి శంకర్ ను మూడు నెలల కాలానికి తహ్కలిక ఇన్చార్జిగా నియమించినా, ఆయనే కొనసాగుతున్నారు. 


అంగళ్ళ సంఘటనలో ఇతర జిల్లాల నాయకుల మీద కూడా కేసులు నమోదుకాగా, శంకర్ మీద నమోదుకాక పోవడం అంతు చిక్కని రహస్యంగా మారింది. ఈ సంఘటన తర్వాత కొంత కాలానికి చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలలో పార్టీ ఇంచార్జ్ శంకర్ యాదవ్ పాల్గొనకపోవడం విమర్శలకు దారితీసింది. శంకర్ సొంత పనులతో తలమునకలు కావడంతో నియోజకవర్గం మీద ద్రుష్టి తగ్గింది.  ఫలితంగా ఇక్కడ అభ్యర్థిని మార్పు చేయాలని అధిష్టానం భావించినట్లు సమాచారం. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనడానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని తెదేపా నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *