పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు అరెస్టు
పరారిలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును సోమవారం గుంతకల్లు పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. షకీల్ కొడుకు పారిపోయేందుకు ఆయన సహకరించాడని ఉన్నతాధికారులు తేల్చడంతో సీపీ కొత్తకోత శ్రీనివాస్ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. అప్పటి గాలిస్తున్న పోలీసులకు సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లులో పట్టుబడ్డారు. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేయనున్నారు.
డిసెంబర్ 24న అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద తన కారుతో బారికేడ్ను ఢీకొట్టిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్.. అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదుచేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయితే సాహిల్ దేశం విడిచి వెళ్లేందుకు సహకరించాడని దుర్గారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ స్థానిక ఇన్స్పెక్టర్ బీ దుర్గారావు హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్టు చేస్తే తన కెరీర్కు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషన్లో పేరొన్నారు.