16, నవంబర్ 2023, గురువారం

కృష్ణానది జలాలపై 20న విజయవాడలో 30 గంటల దీక్ష

సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు తీవ్ర విమర్శ 


కృష్ణానది జలాల పునః పంపిణీ పై కేంద్రo లోని బిజెపి మోడీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ నవంబర్ 20, 21వ తేదీన  విజయవాడలో జరిగే 30 గంటల దీక్షను  జయప్రదం కోరుతూ గోడపత్రికలను సిపిఐ నగర కార్యదర్శి వి సి గోపీనాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద  విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల కృష్ణా నది జలాలను కేటాయించిందన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు కేటాయిస్తే కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం  తెలంగాణ రాష్ట్రంలో  జరిగే  ఎన్నికల్లో లబ్ధిపొందడానికి  కృష్ణాజిల్లాల పూన: పంపిణీపై  కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గం చర్య అన్నారు. 



తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా కేంద్రం లో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల చట్టం వెనుకబడిన జిల్లాలకు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీఅమలు చేయకుండా ఐదు కోట్ల మంది ప్రజల్ని దగా చేసిందన్నారు. అది మరిచిపోక ముందే  మరొక్కసారి బిజెపి మోడీ ప్రభుత్వం కృష్ణా జలాల పున:పంపిణి పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయంపై అన్యాయం జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపక పోవడం దురదృష్టకర మన్నారు. రాష్ట్రంలో సుమారు 440 మండలల్లో రైతులు కరువుతో అల్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వయంగా పర్యటించి పరిశీలించకపోగా తూ తూ మంత్రంగా  103 మండలను కరువు మండలాలు ఉన్నట్టు  ప్రకటించడం చూస్తే రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.


 కృష్ణా నది జలాల పూన: పంపిణీ పై  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని, రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నవంబర్ నెల 20, 21వ తేదీన విజయవాడలో జరిగే 30 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి. సి .గోపీనాథ్, కే. మణి, దాసరి చంద్ర, కే .విజయ గౌరీ, కే.రమాదేవి, జిల్లా సమితి సభ్యులు ఏ.జమీలాభి, బి.కుమారి, కే.లత, పి.గజేంద్ర బాబు, హెచ్ .బాలాజీ రావు, పి. రఘు, కే. నాగరాజా, ఎన్. జలంధరన్, ఇ .డేవిడ్, కే చంద్రయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *