5, నవంబర్ 2023, ఆదివారం

8న చిత్తూరు జిల్లా బంద్

విశాఖ ఉక్కు పరిరక్షణ, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నవంబర్ 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘ నాయకులు ప్రకటించారు. చిత్తూరు లోని రాఘవ థియేటర్ దగ్గర ఏఐఎస్ఎఫ్ అద్వర్యంలో 8న జరిగే బంద్ పోస్టర్లు విడుదల చేశారు.


విశాఖ ఉక్కు ఆత్మగౌరవాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  బండి చలపతి, టీఎన్ ఎస్ఎఫ్ ప్రభు తేజ, జనసేన విద్యార్తి నాయకులు తరున్ స్పష్టం చేశారు.  విద్యార్థి, యువజన నాయకులు 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని వ్యతిరేకించారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా జరుగుతున్న ఆత్మగౌరవ పోరాటం నవంబర్ 8 నాటికి 1000 రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి,యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలకు పిలుపునిచ్చామన్నారు. కరోనా కష్టకాలంలో లక్షల మందికి ఆక్సిజన్ అందజేసి ప్రాణాలు నిలబెట్టిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టాలన్న ఆలోచన దుర్మార్గమన్నారు.

 లాభాలు వస్తున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుప గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల చైతన్యం కల్పించి ఐక్యం చేస్తామన్నారు. కరువుకు నిలయమైన రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఇంతవరకు ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. 

కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నిధులు కేటాయించకుండా నూతన పరిశ్రమలు ఏర్పాటు వంటి విభజన హామీలు అమలు చేయాలని రాష్ట్రంలోని బిజెపి నేతలు మోడీని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. కేసుల భయంతో మోడీ ముందు మోకరిల్లుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. తన సొంత జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండు సార్లు శంకుస్థాపన చేసినా ఆచరణలో పురోగతి లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతకి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీ న రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పేజీ వరకు జరిగే విద్యాసంస్థల బంద్ కు జిల్లాలోని విద్యార్థినీ, విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, మేధావులు,ప్రజలు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రవీణ్ నాయకులు సూరి ప్రేమ్ చంద్ తెలుగునాడు చిత్తూర్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గోకుల్ ఆదిత్య, నగర అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *