9, నవంబర్ 2023, గురువారం

15న ప్రజారక్షణ భేరికి తరలిరండి

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు                                                       


రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కార కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి   బహిరంగ సభకు 15 చిత్తూరు జిల్లా నుండి భారీగా కదిలి రావాలని నగిరిలో పాస్టర్ విడుదల చేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం భారీ స్థాయిలో ప్రజా రక్షణ భేరి పేరుతో సభ నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శ సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరవుతున్నారు. 


ఈ సందర్భంగా సిపిఎం ప్రజా ప్రణాళిక విడుదల చేస్తూ పేదలకు కరెంటు యూనిటీ ఒక్క రూపాయికే ఇవ్వాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, గ్యాస్ 400 రూపాయలకు ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్ 60 రూపాయలు తేవాలని, అన్ని రకాల పింఛన్లు ఐదువేలు చేయాలని, డిమాండ్ చేశారు. అదేవిధంగా నగిరిలో వేలాదిమంది ఉన్న పవర్ లూం కార్మికులకు గతంలో అగ్రిమెంట్ ప్రకారం కూలి రేట్లు పెంచాలని, నగిరి సభలో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని, ఎన్నో సంవత్సరాలగా వారి కుటుంబాలు కష్టపడి పనిచేస్తున్న జీవితాలు మెరుగుపడిన పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవడానికి హంద్రీనీవా , గాలేరు -నగిరి ప్రాజెక్టు పూర్తి చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని, పాల రైతులను దోపిడీ చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని, వీటి సాధనకై జరిగే ఈ ప్రజా రక్షణ భేరి కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం ప్రజా ప్రణాళికను ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగిరి సిపిఎం కార్యదర్శి పెరుమాళ్ నాయకులు జగదీష్, షణ్ముగం, మురుగేష్, తిరుమల్ లక్షాధిపతి తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *