ప్రభుత్వ అవినీతి మీద CBI విచారణ కోరుతూ పిల్
రాష్ట్ర ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. మొత్తం 1,311 పేజీలతో రఘురామ రాజు తరపున న్యాయవాది ఉన్నం మురళీధర్ సుదీర్ఘ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీఎం జగన్, అయన మంత్రివర్గం, పలువురు సీనియర్ అధికారులతో సహా మొత్తం 41 మందిని ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డిలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిల్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు నెంబరు కూడా కేటాయించింది. సీఎం జగన్ పై ఉన్న కేసుల విషయం తేల్చాలని, కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును రఘురామ ఆశ్రయించారు.
ఈ మేరకు ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందన్న విషయాన్ని రఘురామ వివరంగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజాధనానికి నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. సాక్షి పత్రిక, సాక్షి చానల్ కు లబ్ది కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సీఎస్ సహా పలువురు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా రఘురామ తన పిటిషన్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మొత్తం 1,311 పేజీలతో రఘురామ న్యాయవాది ఉన్నం మురళీధర్ సుదీర్ఘ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం ఇసుక, అంబులెన్స్ ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. పోర్టులను అనుచరులకు కట్టబెట్టే క్రమంలో భారీ అవినీతికి పాల్పడ్డారని వివరించారు. టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఇసుక కుంభకోణానికి పాల్పడ్డారని ఆ పిటిషన్ లో తెలిపారు.
పేదలందరికీ ఇళ్లు అనే పథకం ద్వారా ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. ఎక్సైజ్ పాలసీని మార్చి భారీ ఎత్తున మద్యం అక్రమాలకు పాల్పడ్డారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. భారతీ సిమెంట్స్ కు కూడా లబ్ది కలిగేలా వ్యవహరించారని, ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంట్ రెడ్ బ్యాగ్ లలో ఇవ్వాలని నిబంధన విధించిన అంశాన్ని కూడా పిటిషన్ లో ప్రస్తావించారు. అన్ని సిమెంట్ కంపెనీలు ఇక్కడే భారతీ పాలిమర్స్ నుంచి రెడ్ బ్యాగ్ లు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్టు వివరించారు. సీఎం, మంత్రివర్గం, పలువురు సీనియర్ అధికారులతో సహా మొత్తం 41 మందిని ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డిలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. రఘురామ పిల్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు... ఆ పిల్ కు నెంబరు కేటాయించింది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ ఏపీ ఎండీసీ సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐడీ వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు, పలువురు టీడీపీ నేతలపై గురువారం కేసు నమోదు చేసింది. ఈ మేరకు గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు అయినట్లయింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఇసుక అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ-1 గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-౩గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమను పేర్కొన్నారు. వీరంతా తమ చర్యల ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని మైన్స్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.