10, అక్టోబర్ 2023, మంగళవారం

వెలుగు యానిమేటర్స్ సమస్యలు పరిష్కరించాలి: CITU

ధర్నాలో వాడ గంగరాజు డిమాండ్


ఎ పి వెలుగు విఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరతూ  సిఐటియు ఆధ్వర్యంలో 36 గంటల పాటు ధర్నా మరియు వంట వార్పు కార్యక్రమంను మంగళవారం కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు వివో ఏల జిల్లా గౌరవాధ్యక్షుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివోఏల సమస్యలు పరిష్కారం చేయకుండా గత నాలుగు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇప్పటికైనా వివోఏల సమస్యలను పరిష్కరించాలని రాబోయేది ఎన్నికల కాలమే అని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. లేకుంటే వైసిపి ప్రభుత్వానికి వివోఏళ్లంతా ప్రజల ఐకమత్యం చేసి బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతారని హెచ్చరించారు. మూడు సంవత్సరాల  కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, సి.బి.ఓ.హెచ్.ఆర్ పాలసి అమలు చేయాలని,10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విఓ ల మెర్జ్ ఆపాలి, అన్ని రకాల బకాయిలు చెల్లించాలి. లోకో యాప్ వర్క్ కోసం 5 జి మొబైల్ ప్రభుత్వమే ఇవ్వాలి. వాలంటీర్ ఐ.డి తో విఓఎ తో పనిచేయించరాదు. విఓఎ ఐడి ద్వారా పనిచేయించాలన్నారు. 15 సంఘాల లోపు ఉన్న విఓఏ లకు వేతనాలు చెల్లించాలని, విఓల మెర్జ్ వలన ఉపాధి కోల్పోయిన విఓఏ లకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

 ఈ ధర్నా కార్యక్రమంకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు జీను రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి పి.నాగరాజు, నాయకులు శ్రీధర్, మంగమ్మ, శేషాద్రి,శాంతి, చంద్రబాబు,మణి లతో పాటు విఓఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *