తెదేపా దీక్షలకు వన్నియకుల క్షత్రియల మద్దతు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ చిత్తూరులోని కొంగారెడ్డిపల్లి వద్ద సామూహిక నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు బుధవారం వన్నియకుల క్షత్రియ సంఘం సైనికులు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. వన్నియకుల క్షత్రియ సంఘం రాష్ట్ర కోశాధికారి, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ C.R. రాజన్.. ప్రముఖ న్యాయవాది TG. త్రిమూర్తి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ సామూహిక నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఆణిముత్యంలా చంద్రబాబు విడుదల కావాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంఘం నాయకులు, టీడీపీ నాయకులు షణ్ముగరెడ్డి, విజయకుమార్, ఉదయ్ కుమార్, మోహన్, శంకర్, దేవరాజ్, మురుగా, గోపి, మాజీ MLC దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాజూరు బాలాజీ, కటారి హేమలత, V. గోపాలకృష్ణన్, శివప్రసాద్, సేటు, వినాయకం గౌండర్, మదన్, శివ, జనసేన నాయకులు శరవణ, తదితరులు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సామూహిక రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.