6, సెప్టెంబర్ 2023, బుధవారం

సనాతన ధర్మం ఒక అంటురోగమా !?


సనాతన ధర్మం గురించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనుమడు, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి చేసినా వ్యాఖ్యలు హిందూ సమాజంలో కలకలం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని అనుచరించే మటాధిపతులు, పీటాధిపతులు, సాధులు, సన్యాసులు, ధార్మిక సంస్థలు తమ నిరసనను తెలియచేస్తున్నాయి. పలువురు హిందువులు Sun Direct ను పీకివేస్తున్నారు. వేరే DTH లను పెట్టుకుంటున్నారు. జెమిని గ్రూప్ చానళ్ళను బహిస్కరిస్తున్నారు. మంత్రి ఉదయనిది స్టాలిన్ తల నరికి తీసుకుని వస్తే 10 కోట్ల రూపాయల బహుమతి ఇస్తానని అయోధ్య సాధువు పరమహంస ఆచార్య ప్రకటించారు. ఉదయనిది వ్యాఖ్యలను సుమోటోగా విచారణకు స్వీకరించాలని 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్ర చూద్ కు  లేఖ రాశారు. సనాతన ధర్మం అంటే మతంకాదు, అది ఒక జీవన యానం. ప్రతి దేశానికి ఒక సంస్కృతి, సంప్రదాయం ఉంటుంది. వాటిని అర్థం చేసుకోకుండా విమర్శించడం సరికాదని TTD చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 ‘‘ సనాతన ధర్మం మలేరియా లాంటిది.. డెంగ్యూ లాంటిది.. కరోనా లాంటిది.. అది దేశంలో విపరీతంగా వ్యాపిస్తోంది. సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి’’ అంటూ డీఎంకే పార్టీ నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై  గత రెండు, మూడు రోజులుగా  దేశ వ్యాప్తంగా ఓ పెద్ద చర్చ జరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు, హిందూ మత పెద్దలు ఉదయనిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడమంటూ మండిపడుతున్నారు.

ఉదయనిది తల నరికితే రూ.10 కోట్ల బహుమతి

సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తల నరికి తీసుకుని వస్తే 10 కోట్ల రూపాయల బహుమతి ఇస్తానని అయోధ్య సాధువు పరమహంస ఆచార్య ప్రకటించారు. ఒకవేళ ఈ మొత్తం సరిపోదు అంటే దాన్ని మరింత పెంచడానికి కూడా సిద్ధమేనని చెప్పారు. ఎవరు ముందుకు రాకపోతే తాను ఆ పని చేస్తానని అన్నారు. కలరా మలేరియా డెంగీ జ్వరాలు మాదిరిగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశంలోని 100 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు 

సిజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ 

ఉదయనిది వ్యాఖ్యలను సుమోటోగా విచారణకు స్వీకరించాలని 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్ర చూద్ కు  లేఖ రాశారు. ద్వేషపూరిత ప్రసంగం చేయడమే కాకుండా, దానిపై క్షమాపణలు చెప్పడానికి ఉదయనిధి నిరాకరించారని పేర్కొన్నారు. ఇది దేశంలోనే మెజార్టీ జనాభాకు వ్యతిరేకంగా ద్యేష పూరిత ప్రసంగంతో సమానం అన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించి, చట్టబద్ధ అపహస్యం చేసిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ  అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరుతున్నాం అని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ SN ధింగ్రాతో సహా 14 మంది విశ్రాంత జడ్జీలు, 130 మంది విశ్రాంత ఉన్నతాధికారులు, 118 మంది మాజీ సైనిక అధికారులు దీని మీద సంతకాలు  చేశారు.

సనాతన ధర్మం అంటే మతం కాదు జీవన యానం: TTD చైర్మన్

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆయన రాజకీయంగా వ్యాఖ్యానించడంతో బోర్డులో ఈ విషయం మాట్లాడలేమన్నారు. దేవస్థానం ధర్మకర్తల మండల చైర్మన్ గా, రాజకీయ నేతగా చెబుతున్న సనాతన ధర్మం అంటే మతం కాదు, అది ఒక జీవన యానం. ప్రతి దేశానికి ఒక సంస్కృతి, సంప్రదాయం ఉంటుంది. వాటిని అర్థం చేసుకోకుండా విమర్శించడం సరికాదు. ఇవి సమాజంలో అలజడిని సృస్టించడానికి  పనికొస్తాయి తప్ప, విమర్శించిన వాళ్ళకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని వివరించారు.

సనాతన ధర్మం అంటే ఏమిటి? 

వేదాల్లో ఎక్కడా కూడా సనాతన ధర్మం ప్రస్తావన లేదు. ద్వాపర యుగంలో.. మహా భారత యుద్ధం సమయంలో మొదటి సారి సనాతన ధర్మం ప్రస్తావన వచ్చింది. యుద్ధం సమయంలో అర్జునుడు సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. ఆ తర్వాతి కాలంలో సనాతన ధర్మం చాలా పాపులర్‌ అయింది. సనాతనం ధర్మం ప్రాంతాలు, కాలాలను బట్టి మారదు. వందల ఏళ్లు అయినా.. ప్రపంచం ఈ మూలనుంచి ఆ మూల వరకు ఒకే విధంగా ఆచరణలో ఉంటుంది. ఆచరింపబడుతుంది. సనాతన ధర్మం అనేది రెండు పదాల కలయిక. ఇవి సంస్కృతం నుంచి ఉద్భవించాయి. సనాతనం అంటే ‘‘ నిత్యమైనది’’.. ‘‘ ఏనాటికీ మారనిది’’ అని అర్థాలు ఉన్నాయి. ధర్మం అంటే.. జీవన విధానం అన్న అర్థం ఉంది. సనాతన ధర్మం అంటే.. ఎప్పటికీ మారని, నిత్యమైన జీవన విధానం. సనాతన ధర్మం వేదాలు ఎంత ప్రాచీనమైనవో.. అంత ప్రాచీనమైనది..  దేశకాల సరిహద్దులు లేని ధర్మం సనాతన ధర్మం. హిందుగా పుట్టిన వారు పాటించే ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టత లేదు. 

సనాతన ధర్మం ఏమి చెబుతోంది?

సనాతన ధర్మం నాటినుంచి నేటి వరకు శాంతికి పెద్ద పీట వేస్తోంది. ఈ సనాతన ధర్మంలో మొత్తం ఎనిమిది భాగాలు ఉంటాయి. సనాతన ధర్మాన్ని ఆచరించే వారు. ఈ ఎనిమిది భాగాలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ ఎనిమిది భాగాలకు సంబంధించి ఓ శ్లోకం ఉంది. ఆ శ్లోకంలోనే సనాతన ధర్మం మొత్తం ఇమిడి ఉంటుంది.

‘‘ఇద్యా అధ్యయన దానాని.. 

తపహ, సత్యం, ధృతిహి, క్షమ ..

అలోభ ఇతి మార్గోయం 

ధర్మస్య అష్టవిధః స్మతహా..’’

ఇధ్య : ఇధ్య అంటే పూజించటం.. గౌరవంగా ఉండటం అన్న అర్థం ఉంది. ఇధ్యలో భాగంగా ప్రతీ ఒక్కరిని గౌరవించడం, దేవుడ్ని పూజించటం, ప్రకృతిని ఆరాధించటం చేయాలి. అహంకారం లేకుండా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. సాటి మనుషుల్ని గౌరవించాలి.

అధ్యయన : అంటే ప్రతీరోజూ అధ్యయనం చేయాలి, పరిశీలించుకోవాలి. మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. ఎంత వరకు మార్పు చెందామో చూసుకోవాలి. అలాగే ప్రకృతిని కూడా అధ్యయనం చేస్తూ.. దాన్నుంచి నేర్చుకోవాలి.

దానం : నేను అని కాకుండా మనం అని ఆలోచించాలి. ఇతరులకు సహాయపడాలి. దానం చేస్తూ ఉండాలి. లేని వాళ్లకు విద్యాదానం, అన్నదానం చేస్తూ ఉండాలి. నీకు ఎంత అవరసరమో అంతే నీ దగ్గర ఉంచుకుని మిగిలినది దానం చేయాలి. మనిషిగా సహానుభూతిని కలిగి ఉండాలి.

తపహ : ఈ శరీరంతో ఎవర్నీ బాధపెట్టవద్దు, ఈ శరీరంతో ఎలాంటి చెడ్డ పనులు చేయవద్దు, నీ మాటలతో ఎవర్నీ ఇబ్బంది పెట్టవద్దు, నీ మనసుతో కూడా ఎవర్నీ ద్వేషించకూడదు. ఎవర్నీ శత్రువుగా భావించవద్దు. మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. తపస్సు అంటే మనసును ప్రశాంతగా ఉంచుకోవటం. త్రికరణ శుద్ధిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

సత్య : ఎల్లప్పుడూ సత్యాన్నే పాటించాలి. నిజాలు మాట్లాడాలి. అబద్ధాలు చెప్పరాదు.

ధృతిహి : ధైర్యంగా ఉండటం. ఏదైనా ఆశయాన్ని పెట్టుకుంటే.. ఆ ఆశయం మీదే ఉండాలి. వేరే ఆలోచన పెట్టుకోరాదు. ధైర్యంగా ముందుకు వెళ్లాలి.

క్షమ : జాలి, దయ చూపిస్తుండాలి. సాటి మనుషులపై, జీవులపై జాలి, దయ కలిగి ఉండాలి.

హిందూ ధర్మం.. సనాతన ధర్మం ఒక్కటేనా?

హిందూ మత పెద్దలు చెబుతున్న దాని ప్రకారం.. హిందూ ధర్మం.. సనాతన ధర్మం వేరు వేరు కాదు. హైందవ ధర్మం, సనాతన ధర్మం కవల పిల్లల లాంటివి. అయితే, హైందవ ధర్మం కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తుంది. త్రేతాయుగంలో ఉన్న జీవన విధానాన్ని కలియుగంలో పాటించడానికి కుదరదు. కలియుగంలో ఎలా ఉండాలో అలానే ఉండాలి. యుగ ధర్మం బట్టి మారుతూ ఉండేది హైందవ ధర్మం. కానీ, ఈ ధర్మాలకు మూలం సనాతన  ధర్మం. ఇది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది.

సనాతన ధర్మం విస్తృతి చాలా పెద్దది. ఇక్కడ నాస్తికులకు, ఆస్తికులకు ఇద్దరికీ ఇక్కడ చోటుంది. దేవుడు ఉన్నాడని నమ్మినా.. లేడు అని అన్నా.. ఎలాంటి తప్పులేదు. సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతానికి పెద్ద పీట ఉంది. ముఖ్యంగా మంచి కర్మలకు ఈ ధర్మం ప్రాధాన్యత ఇస్తుంది. చార్వాక సిద్ధాంతానికి కూడా సనాతన ధర్మంలో చోటు ఉంది. సమాజానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎంజాయ్‌ చేయటానికి కూడా ఆస్కారం ఉంది. ఇక్కడ ఓ మతం తక్కువ.. మరో మతం ఎక్కువ అని చెప్పటం ఉద్ధేశ్యం కాదు.

తనకు ఇష్టం వచ్చిన మతాన్ని, ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు మనిషికి ఎప్పుడూ ఉన్నాయి. ఇక్కడ మనిషి చేయాల్సిందల్లా తమ మతాన్ని ఆచరిస్తూ.. అభిమానిస్తూ.. ఇతర మతాలను గౌరవించటం. ఇలా చేస్తే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ, ముఖ్యమంత్రి కుమారుడు, ఓ రాష్ట్రానికి మంత్రి అయిన ఉదయ నిధి స్టాలిన్‌ ఓ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయటం వల్లే అసలు సమస్య వచ్చింది. 


NOTE

👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT  US ద్వారా తెలియచేయగలరు. 

👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.

👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.

👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.

👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *