1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఏపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా వైఎస్ షర్మిల !?

23న  కాంగ్రెస్ లో చేరనున్న షర్మిల 
ఎన్నికల వరకు తెలంగాణలో ప్రచారం 
మల్లీ AP కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా
కడప నుండి లోక్ సభకు పోటీ
జగనన్న బాణం తిరిగి  జగనన్న మీదికే 
 
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా  స్వర్గీయ వైఎస్ తనయ, ముఖ్యమంత్రి జగన్ సోదరి వైయస్ షర్మిల నియమితులు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండు రోజుల కిందట షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీలను కలిశారు. YSR తెలంగాణా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది. అధిష్టానం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొని పనిచేయాలని సూచించగా వైయస్ షర్మిల అందుకు అంగీకరించలేదని సమాచారం. తాను ఇప్పటివరకు తెలంగాణలో చేసిన పాదయాత్రను గుర్తు చేశారు. తనకున్న అనుచరులు, వారి భవిష్యత్తు ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు వయా మీడియగా ఇటు తెలంగాణాలో, అటు ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. అయితే ఈ ఎన్నికలలో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాల్సిందిగా షర్మిలకు అధిష్టానం సూచించింది. 

కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలను చూడడానికి ఇన్చార్జిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇందుకు షర్మిల కూడా అంగీకరించినట్లు తెలిసింది. తొలుత ఆమె తెలంగాణలోనే పనిచేయాలని పట్టుపట్టారు. అయితే తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకొని రావలసిన అవసరం ఉందని అధిష్టానం షర్మిలకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. నేరుగా పిసిసి అధ్యక్షురాలుగా నియమితులు కావడానికి షర్మిల అంగీకరించకపోవడంతో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేయడానికి అంగీకరించబడినట్లు తెలిసింది.
 
ఈనెల 23వ తేదీన షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుందని సమాచారం. చేరిన తర్వాత ఆమెను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించి, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను షర్మిలకు అధిష్టానం అప్పగించనుంది. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకు దెబ్బ కొట్టవచ్చని అధిష్టానం భావిస్తోంది. 2024 లో జరగనున్న ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిధ్యేయంగా పనిచేయాలని, 2029 సంవత్సరంలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రణాళికల రూపొందించాలని అదిష్టానం దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. ఎందుకు అనుగుణంగా జగనన్న వదిలిన బాణాన్ని  కాంగ్రెస్ అధిష్టానం తిరిగి  ఆ జగనన్న మీదికే ప్రయోగించనుంది. 

వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్దమైంది. కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీతో ఢిల్లీలో షర్మిల భేటీ అయ్యారు. పార్టీ విలీనం..భవిష్యత్ బాధ్యతలపైన ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. సోనియాతో చర్చలు జరిగాయి. ఇక పార్టీ విలీనం లాంఛనమే. ఏపీలో షర్మిల సేవలను వినిగియోంచుకోవాలనే పార్టీ ఆలోచనకు అనేక తర్జన భర్జనల తరువాత షర్మిల అంగీకరించారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం..పార్టీలో తన పాత్ర...బాధ్యతల పైన పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలు చర్చలు జరిపారు. షర్మిలను పార్టీలోకి ఆహ్వానం.. విలీనం పైన కాంగ్రెస్ ముఖ్య నేతలు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. తెలంగాణకే తాను పరిమితం అవుతానంటూ తొలి నుంచి షర్మిల చెబుతూ వచ్చారు. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. వైఎస్సార్ తో కలిసి పని చేసిన కాంగ్రెస్ నేతలు షర్మిలకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఎన్నికల వేళ మరింత ఆలస్యం చేయకుండా ముందుగా షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలను వినియోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది.


ఇదే ప్రతిపాదనకు షర్మిల సైతం అంగీకరించినట్లు సమాచారం. సోనియాతో సమావేశం సమయంలో ఏపీలోనూ షర్మిల పార్టీ బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో ఎన్నికల వరకు ప్రచారంలో షర్మిల భాగస్వామి కానున్నారు. పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల కోరుకున్నా, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు షర్మిల అంగీకరించారని చెబుతున్నారు. దీంతో, సోనియాతో జరిగే సమావేశానికి తన భర్త అనిల్ తో కలిసి షర్మిల హాజరు అయ్యారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి నాడు షర్మిల తన భవిష్యత్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తో కొనసాగింపు..లక్ష్యాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ను ప్రధాని చేయాలనే తన తండ్రి లక్ష్యం మేరకు తాను పని చేస్తానని షర్మిల చెప్పనున్నట్లు తెలుస్తోంది.


ఇక, తెలంగాణ ఎన్నికలు పూర్తవుతూనే ఏపీలో ఫోకస్ చేసేలా ఇప్పటికే షర్మిలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు చేసింది. పార్టీ తరపున ఏపీలో ప్రచారానికి షర్మిల అంగీకరించారని సమాచారం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించేందుకు సిద్దమైంది. దీని ద్వారా ఏపీలో సీఎం జగన్..ఆయన ఓట్ బ్యాంక్ లక్ష్యంగా ఏపీలో షర్మిల సేవలను కాంగ్రెస్ వినియోగించుకోవాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్నీ అనుకూలిస్తే కడప లోక్ సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా షర్మిలను దించాలనేది కాంగ్రెస్ ఆలోచనగా విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ బ్యాంక్ జగన్ వైపు టర్న్ అయింది. ఇప్పుడు. అయితే, ఏపీలో షర్మిల కాంగ్రెస్ నేతగా బాధ్యతలు స్వీకరిస్తే ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం ఉంది. 




NOTE

👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు. 

👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.

👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.

👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.

👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *