11, సెప్టెంబర్ 2023, సోమవారం

శ్రీకాళహస్తిలో కనిపించని బొజ్జల సుధీర్ !!


 తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు అరెస్టుతో గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ ఇంచార్జిలు అధ్వర్యంలో బందులు, రాస్తారోకోలు, నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇంచార్జీలు ముందుండి ఆందోళనలను నడుపుతున్నారు. కార్యకర్తలకు అగ్రభాగంలో ఉంటున్నారు. కార్యకర్తలకు మనో ధైర్యం కలుగ చేస్తున్నారు. పోలీసులతో పోరాడుతున్నారు. లాటీ దెబ్బలు తింటున్నారు. ఆందోళనలు చేస్తున్న కార్యకర్తల బాగోగులను దగ్గరుండి చూస్తున్నారు.  పోలీసులు  ముందస్తుగా నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఆందోళనలను చేస్తున్న వారిని అరెస్టు చేసి, పోలీసుస్టేషన్ లకు తరలిస్తున్నారు. పోలీసు స్టేషన్లు తిప్పుతున్నారు. వారి మీద కేసులు నమోదు అవుతున్నాయి. స్థానికంగా ఉండి పార్టీ నాయకులకు అండగా,  ప్రజలలోకి బలంగా బాబు అరెస్టును తీసుకుని వెళ్లి ప్రజలలో సానభూతి పెంచుకునేలా కార్యక్రమం చేయాల్సిన నియోజక వర్గ ఇంచార్జి సుధీర్ రెడ్డి స్థానికంగా లేక పోవడంతో పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


అయితే కాళహస్తి దేశం ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి ఇవి ఏవీ పట్టలేదు. ఆయన గత మూడు రోజులుగా  పత్తా లేకుండా పోవడం దేశం శ్రేణులలో త్రీవ అసంతృప్తి వ్యక్తం అవుతుంది. బాబును అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయా నియోజక వర్గం ఇంచార్జిలను పార్టీ అధిష్టానం అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఆ రోజు రాత్రి చెన్నైలో వున్న బొజ్జల సుధీర్ రెడ్డి హుటా హుటినా కాళహస్తి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉన్నా, చెన్నై నుంచి  మధ్యాహ్నం గానీ రాలేదు. అప్పుడు కూడా సత్య వేడులోనే పోలీసులు అదుపు లోకి తీసుకొని అక్కడే ఉంచారు. ఆ రాత్రికి అయిన కాళహస్తి చేరుకుని రెండో రోజు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తారని భావించిన పార్టీ నాయకులకు నిరాశ ఎదురైంది. సుధీర్ రెడ్డి అటే చెన్నైకు వెళ్లి పోవడంతో ఆందోళన కార్యక్రమాలు బాధ్యత స్థానిక నాయకులపై పడింది. ఆది నుంచి పార్టీ పట్ల వీరవిధేయత, చంద్రబాబుపై అపార అభిమానం ఉన్నా, ముందుండి  నడిపే నాయకుడు లేకున్నా ఉన్న నాయకులు  పోరాటం చేపట్టారు. పోలీసులను లెక్క చేయక నిరసనలు చేశారు.  


స్థానికంగా ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఉన్నా, శ్రీకాళహస్తి వదలి పెట్టీ అధిష్టానం వద్ద మార్కులు పొందేలా విజయవాడకు వెళ్లడం ఏమిటి అని నాయకులే ప్రశ్నించారు. ఆది నుంచి స్థానికంగా ఉండి పార్టీని  నడపడం లేదున్న అపకీర్తి వున్నా, బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీ అధినేతనే అరెస్టు చేసినా కాళహస్తిలో నిరసనలు గాలికి వదలి విజయవాడకు వెళ్లడంపై పార్టీ శ్రేణులకు ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయేలా చేసింది. పుండుపై కారం చల్లిన్నట్లు పోలీసులను ఎదిరించి నిరసనలు చేసిన నాయకులపైనా  ఏకంగా 16 మందిపై హత్యాయత్నంతో సహా తీవ్ర సెక్షన్ లతో పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపారు. మీకు ఏదైనా జరిగితే దిక్కు ఎవురు అని  వైసిపి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నట్లు  కార్యకర్తలు, అభిమానులు వాపోతున్నారు. 

ముందు వుండి నడిపించాల్సిన నాయకుడు పత్తా లేకుండా పోవడం,  ముందు వుండి పార్టీ నీ నడిపిన నాయకులు కేసులలో ఇరుక్కు పోవడం కార్యకర్తలను డీలా పడేలా చేశాయి. సుధీర్ రెడ్డి విజయవాడ నుంచి పంపుతున్న  వాట్సప్ సందేశాలు చూసి, నాయకులు ఉత్తర ప్రగాల్బులు తలపిస్తున్నాయి అని అంటూ తలలు పట్టు కోవడం కోస మెరుపు. వైసిపి నాయకులు హేళనలు దేశం నాయకులు మరింత కృంగదీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహార శైలితో కాళహస్తి లో తెలుగు దేశం ఉనికికే ప్రశ్నర్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. 

NOTE

👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న CONTACT  US ద్వారా తెలియచేయగలరు. 

👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.

👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.

👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.

👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *