22, ఏప్రిల్ 2024, సోమవారం

టిడిపికి విస్తృతంగా ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏ.ఎస్. మనోహర్


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు, చిత్తూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఏఎస్ మనోహర్ చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురుజల జగన్మోహన్ నాయుడు విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయన అభ్యర్థి గురుజాలతో పాటు ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. శాసనసభ్యుడిగా పనిచేసిన ఏ ఎస్ మనోహర్ కు నియోజకవర్గంలో విస్తృతంగా సంబందాలు ఉన్నాయి. అయన మూడు సార్లు ఎం ఎల్ ఏ గా, ఒక పర్యాయం మునిసిపల్ చైర్మన్ గా పోటి చేశారు. స్వతహాగా సౌమ్యుడు అయిన మనోహర్ కు నియిజకవర్గంలో బందువులు కూడా ఎక్కువగా ఉన్నారు. మనోహర్ కు వివాద రహితుడిగా పేరుంది. ఈ నేపధ్యంలో  మనోహర్ ప్రచారం టిడిపికి బాగా కలిసివస్తుందని భావిస్తున్నారు. అయన గుడిపాల, చిత్తూరు మునిసిపాలిటీలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒక వైపు పార్టీని బలోపేతం చేస్తూ, మరో వైపు పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తున్నారు.  




బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ ఎస్ మనోహర్ 1994 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మూడు నెలలకు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఘన విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఆయన కాలంలో చిత్తూరు మున్సిపాలిటీకి భారీగా ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చాయి.  ఈ నిధులతో నాలుగైదు చోట్ల షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం జరిగింది. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి శర వేగంగా జరిగింది. ఈనాటికి మున్సిపాలిటీకి ఆదాయాలు వస్తున్నాయి అంటే అది ఏఎస్ మనోహర్ కాలంలో జరిగిన అభివృద్దే. ఆయన 1999 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీకే బాబు మీద విజయం సాధించి, అసెంబ్లీలో అడుగు పెట్టారు. తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో పార్టీ టికెట్టును అనూహ్యంగా గుడిపాల మండలానికి చెందిన బాలాజీ నాయుడుకు టిడిపి టిక్కెట్టు కేటాయించారు. తనకు సమాచారం ఇవ్వకుండా తనను కాదని బాలజీకి టిక్కెట్టు ఇవ్వడంతో అసంతృప్తి గురైనమనోహర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 2012 వ సంవత్సరంలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా, క్రియాశీలకంగా వ్యవహరించలేదు. తిరిగి 2014 ఎన్నికల్లో డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి డీకే సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2019 ఎన్నికలలో డీకే సత్య ప్రభకు రాజంపేట పార్లమెంట్ స్థానానికి కేటాయించి, అనూహ్యంగా ఏఎస్ మనోహర్ కు చిత్తూరు అసెంబ్లీ టికెట్ ను చంద్రబాబు కేటాయించారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో వైసీపీ గాలిలో  మనోహర్ ఓడిపోయారు. ఆనాటి నుంచి వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా రాజీనామా చేశారు.




గురజాల జగన్మోహన్ నాయుడుకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు లభించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులందరినీ బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏ ఎస్ మనోహర్ ను కలిసి తన గెలుపునకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీలో తిరిగి క్రియాశీలకం కావాల్సిందిగా కోరారు. ఈ పర్యాయం పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత  గౌరవం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఏఎస్ మనోహర్ తిరిగి రాజకీయంగా క్రియాశీలకం కావాలని, చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ నాయుడు విజయానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన  ఆత్మీయ సమావేశంలో  నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జగన్మోహన్ నాయుడుకు మద్దతు ప్రకటించారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం రోజు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇదివరకు పార్టీలో ఉండి పార్టీకి దూరం అయిన వారిని, కొత్త వారిని పార్టీలోకి తీసుకువస్తున్నారు. బలిజ సమాజికవర్గ నేతలలో నిరంతరం మాట్లాడుతూ ఆ సామాజిక వర్గం ఓట్లను టిడిపికి అనుకూలంగా మార్చుతున్నారు.  బలిజ సామజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నాయి. గెలుపు ఓటములను శాసించే శక్తి ఉంది. ఈ సరి బలిజ సామజిక వర్గం టిడిపి వైపు మొగ్గుచుపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోహర్ తిరిగి పార్టీలో చేరడం, ప్రచారంలో జోరుగా పాల్గొనడం కారణంగా ఎన్నికలలో టిడిపి లాభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *