30, ఏప్రిల్ 2024, మంగళవారం

దళితులకు ద్రోహం చేసిన జగన్మోహహన్ రెడ్డి


27 దళిత పథకాలు రద్దు చేశాడు... కొత్తది ఒక్కటీ లేదు

ప్రభుత్వ వేధింపులకు అమానుషంగా బలైన దళితులు ఎందరో..
దళితుల 12,000 ఎకరాల అస్సైన్డ్‌ భూములను లాక్కొన్నాడు. 

సబ్‌ ప్లాన్‌ పోయింది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం 

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకం లేదు. 

విదేశీ విద్య, భూమి కొనుగోలు పథకాలు రద్దు. 

దళిత యువత కోసం  పారిశ్రామిక విధానం జాడ లేదు. 

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ లేదు. 

 కోడి కత్తి డ్రామాతో దళితుడు శ్రీనివా్‌సను జైలుపాలు 

ప్రభ న్యూస్ బ్యూరోతో దగ్గుమళ్ళ ప్రసాదరావు 

చిత్తూరు, ఏప్రిల్ 30. (ప్రభ న్యూస్ బ్యూరో ): ‘‘జగన్‌రెడ్డి హయాంలో దళితులకు జరిగినంత ద్రో హం చరిత్రలో మరెన్నడూ జరగలేదు. ఈ ద్రోహాన్ని దళితవాడల్లో ఇంటింటా చాటాలి. విశాఖ జిల్లాలో డాక్టర్‌ సుధాకర్‌ మొదలుకొని కడప జిల్లాలో డాక్టర్‌ అచ్చెన్న వరకూ ఎంతో మంది ఈ ప్రభుత్వ వేధింపులకు అమానుషంగా బలైపోయారు. దళితులపై వేధింపులు లేకుండా రాష్ట్రంలో ఒక్క రోజు కూడా జరగడం లేదు’’ అని చిత్తూరు టిడిపి అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు ధ్వజమెత్తారు. మంగళవారం చిత్తూరు ఎన్నికల కర్యలంలో ప్రభ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ.. జగన్‌రెడ్డి దళితులకు చేసినంత వంచన దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27 దళిత పథకాలను రద్దు చేశారని, రాజ్యాంగపరంగా దళితులకు రావాల్సిన హక్కుల కోసం అడుక్కొనే పరిస్థితి తెచ్చారాని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల చేతుల్లోని 12,000 ఎకరాల అస్సైన్డ్‌ భూములను లాక్కొన్నాడు. సబ్‌ ప్లాన్‌ పోయింది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకం లేదు. విదేశీ విద్య, భూమి కొనుగోలు పథకాలు నిలిపివేశాడు. దళిత యువత కోసం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం ఎక్కడుందో కనిపించడం లేదు. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ లేదు. టీడీపీ హయాంలో దళిత డ్రైవర్ల స్వయం ఉపాధికి ఇన్నోవా కార్లు ఇస్తే ఇప్పుడు వాటి అడ్రస్‌ లేదు. కోడి కత్తి డ్రామాలు ఆడి దళితుడు శ్రీనివా్‌సను జైలుపాలు చేశాడు. దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్‌ డెలివరీ చేశాడు. ఇసుక అక్రమ తవ్వకాన్ని ప్రశ్నించాడని వర ప్రసాద్‌ అనే దళిత యువకుడికి పోలీస్‌స్టేషన్లో శిరో ముండనం చేయించారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఒక దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే ప్రధాన నిందితుడిని ఇంతవరకూ పట్టుకోలేకపోయారు. ఎస్సీ ఎస్టీ మహిళలపై దాడుల సంఘటనలు పోలీస్‌ రికార్డుల ప్రకారం 1,300 జరిగాయి. 834 లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయి. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన నేరాల్లో మన రాష్ట్రం దేశంలో అగ్రభాగంలో ఉందని కేంద్ర సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. దళితుల పిల్లలను విదేశాలకు పంపే పథకానికి అంబేద్కర్‌ పేరు పెడితే దానిని తీసివేసి జగనన్న అని పేరు పెట్టుకోవడం వికారం కాక మరేమిటి? అని నిలతీశారు. ఎన్టీఆర్‌ హయాంలో తొలిసారి పేదల గృహ నిర్మాణంలో 50 శాతం ఇళ్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వు చేశాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచామని వివరించారు.

తొలిసారి దళితులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో  పట్టుబట్టి అంబేద్కర్‌కు భారతరత్న ప్రకటింపచేశారనీ తెలిపారు. లోక్‌సభకు బాలయోగిని, అసెంబ్లీకి ప్రతిభా భారతిని స్పీకర్లను చేశాం. రాష్ట్రానికి తొలి దళిత ఆర్థిక మంత్రి మహేంద్రనాథ్‌ టీడీపీ హయాంలోనే పనిచేశారు. దళిత వర్గానికి చెందిన తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు టీడీపీ హయాంలోనే నియమితులయ్యారు. దళితులకు సంబంధించిన సమస్యల పరిశీలనకు జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ వేసి అది ఇచ్చిన మొత్తం సిఫారసులను ఆమోదించి జీవోలు ఇచ్చాం. దళితులకు నిజాయితీగా చేసింది టీడీపీ. మోసం చేసింది జగన్‌. దీనిని ఇంటింటా చెప్పాదానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పేదలు శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు రావడానికి టిడిపి  కంకణం కట్టుకుందని, దీని కోసం పబ్లిక్‌ ప్రైవే ట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని వివరించారు.  దళితులకు చదువు లేకపోవడానికి, ఉద్యోగం రాకపోవడానికి, నిరుద్యోగ యువతకు రుణాలు రాకపోవడానికి కారణం ముఖ్య మంత్రి జగన్‌ అని దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌ ఎస్సీ, ఎస్టీలను ఆర్దికంగా దెబ్బతీశారన్నారు. వైసీపీ దళిత నాయకులలో మంత్రులు, ఎమ్మెల్యే, శాసనసభ స్థాయిలో ఉన్నవారు ఎవరైన ఐదేళ్ళలో ఎస్సీ, ఎస్టీలకు ఏమి చేశారో బహిరంగ చర్చ పెట్టాలనికోరారు. ఎస్సీ, ఎస్టీలకు జరిగిన నష్టాన్ని తాము వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కాక ముందు పదేళ్ళు ప్రచారంలో దళితులు మా మేన మామలు అని చెప్పి, దళితుల ఓట్లు వేయించుకుని 151 సీట్లు సాధించుకుని ముఖ్యమంత్రి అయిన తరువాత దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యంగా విదాభివృద్ధి కొసం గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు అన్నిటినీ రద్దు చేశారనీ ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు గత 5 సంవత్సరాలుగా దళుతుల మీద హత్య, అత్యాచారాలు, దాడులు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత వారానికి నాలుగు హత్యలు, ఆరు హత్యా ప్రయత్నాలు, మూడు అత్యాచారాల చప్పున సగటున రోజుకు ఆరు జరిగాయన్నారు. దక్షిణ భారత దేశంలో దళితులపై జరిగిన దాడులు, అనేక నేరాలలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. జాతీయ నేర ఘణాంక సంస్థఅధికారికంగా ప్రకటించిందన్నారు. జగన్‌ రద్దు చేసిన 27 పథకాలలో విద్యారంగానికి సంబంధించి దాదాపు 8 పథకాలు ఉన్నాయన్నారు. అంబేద్కర్‌ విదేశీ విద్యాపథకాన్ని గతంలో చంద్రబాబు ప్రారంభించి దళితలతో పాటు అన్ని వర్గాలలో ఉన్న పేదల పిల్లలకు విదేశాలలో చదువుకునే అవకాశం కల్పించారన్నారు. దానిని ఆపేసి విద్యాభివృద్ధికి గండి కొట్టారన్నారు. విద్యాభివృద్ధికి సంబంధించిన పథకాలు ఆపడం దళుతులకు తీరని నష్టమన్నారు. అన్ని కులాలతో పాటు దళితులకు అమ్మ ఒడి ఇస్తున్న ముఖ్యమంత్రి అమ్మ ఒడి పథకంతో పాటు దళితులకు ఏమి ఇస్తున్నారని ప్రశ్నించారు. అమ్మ ఒడి, చేయూత, పెన్షన్‌ వంటివి అన్ని కులాలకు వస్తున్నాయని… దళితులకు అదనగా ఒక్క రూపాయి ఇవ్వలెదన్నారు. గతంలో ప్రభుత్వాల అందరికి అమలు చేసే పథకాలతో పాటు దళితులకు ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ల ద్వారా రుణాలు ఇచ్చేవారన్నారు. ఇత కులాలకు ఇచ్చేవి కాకుండా దళితులకు అదనంగా ఒక్క రూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి అదనంగా పథకాలు ఉండాలని రాజ్యాంగంలో ఉందని కాని జగన్‌ వాటన్నిటినీ నిలిపివేశారన్నారు. బహిరంగ సభలలో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పుకుంటూనే వీరందరిని గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్‌ ఆర్ధికంగా దెబ్బతీశారన్నారు. ఈ ఐదేళ్ళలో ఎంత మంది ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. 2.30 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అవి ఇచ్చి ఉంటే ఎస్సీలకు 40 వేలు, ఎస్టీలకు 20 వేల ఉద్యోగాలు వచ్చుండేవి అన్నారు. ఇపుడు డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువత బతకడానికి కూలిపనులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ కారొ్పరేషన్‌కు ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఇళ్ళ స్థలాల పేరుతొ గతంలో ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన 12 వేల ఎకరాల అ సైన్డ్‌ భూములు లాకున్నారన్నారు. దళితులకు రాష్ట్రంలో జగన్‌ చేసినంత మోసం ఇంకెవ్వరూ చేయలేదన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దిమ్చ్చాడమే ధ్యేయంగా దళితులు అందరు పనిచేయాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే దళితులకు న్యాయం జరుగుతుందని దగ్గుమళ్ళ ఆకాంక్షించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *