జిల్లాలో భారీగా తగ్గనున్న మామిడి పంట
10 శాతం పంట లాభించే అవకాశం
వాతావరణ పరిస్థితులే కారణం
ఈ సారీ నష్టాల సాగే
అందోళనలో మామిడి రైతులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతు మరోసారి కుదేలయ్యాడు. మూడేళ్ళుగా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో నష్టపోతున్న రైతు ఈసారి కూడా తీవ్రంగా
నష్టపోయాడు. జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత చాలా తగ్గువ వచ్చింది. వచ్చిన పూత కూడా నిలువలేదు. వచ్చిన పూత కూడా మూడు, నాలుగు దఫాలుగా వచ్చింది. జిల్లాలో ఇప్పుడు కూడా మామిడిలో పూత కనిపిస్తుంది.వాతావరణం అనుకూలించక మామిడి పూతంతా మాడిపోయింది. మరోవైపు పిందే అడుగు భాగాన మచ్చలతో పంట కూడా పూర్తిగా
దెబ్బతింతోంది. కాయ తోటిమ దగ్గర నుండి పాలు కారుతూ, కాయ రంగు మారి కింద పడిపోతుంది. మరో వైపు మామిడి తోటలను మంగు ముంచి ఎత్తుతోంది, మంగు కారణంగా మామిడి ఆకులు నల్లగా మారిపోతున్నాయి. దాని ప్రభావం కాయ మీద పడి, మామిడి పిందెలు కూడా నలుపు రంగులోకి మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో సుమారుగా 90 శాతం మామిడి పంట దెబ్బతిన్నట్లు
రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం బీమా కల్పించి, పంటకు ప్రభుత్వం
నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో సుమారుగా లక్షా, 30 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నయి. ఇందులో 15వేల ఎకరాలు లేత తోటలు కాగా లక్ష ఎకరాల్లో కాపు వస్తుంది. జిల్లాలో సగటున 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రేవాల్చిఉంది. అయితే పూత రాకపోవడంతో 10 శాతం పంట వచ్చే అవకాశం ఉంది. సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, ఈ సంవస్తరము ఒకటి లేక రెండు లక్షల తన్నులు దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎతూర్పు మండలాల్లో ఎక్కువగా విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పండిన పంటంతా చిత్తూరు, దామలచెరువు, బంగారుపాళ్యం, పుత్తూరు, తిరుపతి కేంద్రంగా కలకత్తా, ఢిల్లీ వంటి కేంద్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది జిల్లాలో మామిడి నిరాశాజనంగానే ప్రారంభం అయ్యింది. మంచు, అకాలంగా వీస్తున్న గాలుల వల్ల మామిడి పూత రాలిపోవడంతో పాటు పిందెలకు మచ్చలు ఏర్పడడంతో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇలా జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో మామిడి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మామిడి సాగు దారుల్లో అత్యధికులు కౌలుదార్లే. ఎకరాకు రూ.15వేలు నుంచి రూ.20 వేలుకు లీజుకు తీసుకున్న సాగుదారుడు, గొప్పులు, దుక్కులు, పురుగు మందుల వాడకానికి ఎకరాకు మరో రూ.20 వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రతి ఎకరాకు రైతుకు రూ.40 వేలు వరకూ ఖర్చవుతోంది. అయితే ఈసారి పెట్టు బడులు కూడా తిరిగి రావని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు నష్టపోయారని రైతు సంఘాలు ఆందోళ చేస్తున్నారు.
కానరాని బీమా
మామిడి రైతు గత రెండేళ్లుగా వాతావరణ
ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోతున్నాడు. ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించి, ఆదుకోవడంలో
విఫలమవుతోంది. ఈ ఏడాది వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ భీమా
కల్పించ లేదు. కనీసం ఇప్పటి వరకు బీమా నమోదుకు మార్గదర్శకాలు రూపొందించ లేదు.
ప్రతి పథకానికి ఇ-క్రాప్ నమోదు తప్పని సరి చేయడంతో వెబ్ల్యాండ్లలో తప్పులు తడకలు, రికార్డుల్లేక
రైతు భరోసా కేంద్రాల్లో ఇ-క్రాప్ అంతంత మాత్రంగానే జరుగుతోంది. మామిడి పంట
విషయంలో పూర్తిగా కౌలుదార్లు కావడంతో దాదాపు సాగుదార్లకు బీమా వర్తించని పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
10 శాతమే పంట : డి.డి. ఉద్యానవన శాఖ
చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం 10 శాతం పంట మాత్రమే వచ్చే అవకాశం ఉందని జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటి డైరెక్టర్ డి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. అయన ప్రభ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ.. పంట కూడా ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. గత సంవత్సరం పంట లేట్ గా కోయడం ఒక కారణం కాగా, డిసెంబరు నెలలో వచ్చిన తుఫాన్ కారణంగా ఎండలు లేక పంట ఆలస్యం అయ్యింది. పుత్తూరు నుండి బంగారుపాల్యం వరకు ఈ ప్రభావం ఉంది. ఉగాదికి ఊరుగాయ సైజ్ లో ఉండాల్చిన కాయలు, పింది దశలోనే ఉన్నాయి. మామిడి పూత ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటివరకు జిల్లాలో ఒక సారి కూడా వర్షం పడలేదు. ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. కావున రైతులు మామిడికి సకాలంలో నీళ్ళు కట్టి, జాగర్తగా పంటను కాపాడుకోవాలి.