తల్లికి వందనం పథకం నిధులు మీ ఖాతాలో పడాలంటే ....
తల్లికి వందనం పథకం కింద జూన్ 12 నుంచి పాఠశాలలు తెరిచే రోజున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పధకం కింద ఒక్కొక్క విద్యార్థికి 15 వేల రూపాయల వంతున్న తల్లుల ఖాతాలో జమచేయనున్నారు. ఈ నిధులు తల్లుల ఖాతాలోకి జమ కావాలి అంటే, విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కావాలని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో లింక్ చేయడం కూడా తప్పనిసరిగా సూచించబడింది. ఈ రెండు లింకులు లేకపోతే, రూ.15,000 ఆర్థిక సాయం జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. ఈ మొత్తాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వం ఈ పథకం కింద నిధులను పారదర్శకంగా, సరైన లబ్ధిదారులకు చేరేలా చేయడానికి ఆధార్ మరియు ఎన్పీసీఐ లింకింగ్ను తప్పనిసరి చేసింది. ఆధార్ లింక్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపు సులభతరం అవుతుంది. సమీప బ్యాంకు శాఖను సందర్శించి, ఆధార్ కార్డు మరియు బ్యాంకు పాస్బుక్తో లింక్ చేయించుకోవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే, బ్యాంకు వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆధార్ను లింక్ చేయవచ్చు. బ్యాంకు శాఖలో ఎన్పీసీఐ మ్యాపింగ్ ఫారమ్ను పూర్తి చేయాలి. ఆధార్ నంబర్తో ఎన్పీసీఐ లింక్ చేయడానికి బ్యాంకు సిబ్బంది సహాయం అందిస్తారు. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కావాలని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో లింక్ చేయడం కూడా తప్పనిసరిగా సూచించబడింది. ఈ రెండు లింకులు లేకపోతే, రూ.15,000 ఆర్థిక సాయం జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

