జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు త్రి సభ్య కమిటిల ఏర్పాటు
మండలానికి ఒక పరిశీలకుడి నియామకం
సంస్థాగత ఎన్నికల పరిశీలనకు కమిటీలు
వేసిన కమిటీల అధ్యయనం, కొత్త కమిటిల ఏర్పాటు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణకు కుప్పం మినహా అన్ని నియోజకవర్గాలకు త్రి సభ్య కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతి మండలానికి ఒక పరిశీలకుడిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జరిగిన సంసాగత ఎన్నికలకు వీరు పరిశీలిస్తారు. ఎక్కడైనా సంస్థ గత ఎన్నికలు నిర్వహించకుంటే అక్కడ ఎన్నికలు ఎన్నికలను నిర్వహించి అధిష్టానానికి నివేదికలను అందజేస్తారు. దీంతో జిల్లాలోని మండల, క్లస్టర్, గ్రామ కమిటీల ఏర్పాటు మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. గతంలో ఏర్పాటు చేసిన కమిటీల పైన కూడా కొత్తగా ఏర్పాటు అయిన పరిశీలకులు అధ్యయనం చేస్తారు. గతంలో వేసిన కమిటీలు పార్టీ నియమ నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పరిశీలిస్తారు. కొత్తగా ఏర్పాటు అయ్యే కమిటీల విషయంలో నియమ నిబంధనలు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధగా ఎన్నికలు నిర్వహించడానికి అధిష్టానం ఈ మేరకు నియోజకవర్గస్థాయి, మండల స్థాయి పరిశీలకులను నియమించినట్లు తెలుస్తోంది.చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటికే ఉన్న మారుతి చౌదరి, పి సునీల్ చౌదరి పరిశీలకులుగా ఉండగా ,కొత్తగా జోనల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, రాష్ట్ర కార్యదర్శి పొన్నాలు రాంప్రసాద్ రెడ్డిని పరిశీలకులుగా నియమించారు. చిత్తూరు మండలానికి ఐరాల మండల పార్టీ మాజీ అధ్యక్షుడు గిరినాయుడు, చిత్తూరు టౌన్ కు పలమనేరు మాజీ మార్కెటింగ్ చైర్మన్ రామచంద్ర నాయుడు, గుడిపాల మండలానికి రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కమిటీ కన్వీనర్ జి మనిరాజును పరిశీలకులుగా నియమించారు.
నగరి నియోజకవర్గానికి పరిశీలకులుగా డాక్టర్ చెన్నూరు సుధాకర్ వ్యవహరిస్తుండగా, కొత్తగా రాష్ట్ర పార్టీ కార్యదర్శులు సీఎం సురేష్ నాయుడు, ఊక విజయ్ కుమార్ లను నియమించారు. నగిరి మండల పరిశీలకులుగా పార్లమెంటరీ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ ఎన్ చిన్నబాబు, నగరి టౌన్ కు మాజీ జడ్పీ చైర్మన్ ఎస్ చంద్రప్రకాష్, నిండ్ర మండలానికి పార్లమెంటరీ సెక్రటరీ తలారి రెడ్డప్ప, పుత్తూరు మండలానికి పార్లమెంటు రైతు అధ్యక్షుడు నాగేశ్వరరావు, పుత్తూరు టౌన్ కు పార్లమెంటరీ అధికార ప్రతినిధి సి ఎస్ త్యాగరాజు, వడమాల పేట మండలానికి పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు కే అరుణ, విజయపురం మండలానికి మాజీ ఎంపీపీ హరిబాబు నాయుడు లను పరిశీలకులుగా నియమించారు.
పలమనేరు నియోజకవర్గంకు సి డి సి ఎం ఎస్ చైర్మన్ జయప్రకాష్, తిరుపతి పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్ సి ముని కన్నయ్యలు నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులయ్యారు. బైరెడ్డిపల్లికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి గోపీనాథ్, గంగవరం మండలానికి ఎక్స్ ఎంపీపీ పిసి సాంబశివ, పలమనేరు మండలానికి ఎక్స్ మండల పార్టీ అధ్యక్షుడు హేమాంబర గౌడ్, పలమనేరు పట్టణానికి ఎక్స్ వైస్ ఎంపీపీ ఉదయ్ కుమార్, పెద్దపంజాణి మండలానికి ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, వి కోట మండలానికి ఎక్స్ ఎంపీపీ డాక్టర్ వి వెంకటేష్ లను పార్టీ నియమించింది.
పూతలపట్టు నియోజకవర్గంకు బొమ్మన శ్రీధర్, తుమ్మల కన్నయ్య నాయుడు, పరిమళ కుమారి నియోజకవర్గ పరిశీలికలుగా నియమితులయ్యారు. బంగారు పలెం మండలానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌస్ బాషా, ఐరాల మండలానికి రాష్ట్ర రైతు కార్యదర్శి శివకోటిరెడ్డి, పూతలపట్టు మండలానికి డీసీఎంఎస్ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు, తవణంపల్లి మండలానికి పార్లమెంటరీ సెక్రటరీ జయ చంద్రనాయుడు, యాదమరి మండలానికి పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చౌడప్ప పరిశీలకులుగా నియమితులయ్యారు.
చంద్రగిరి నియోజకవర్గానికి తిరుపతి పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, పార్లమెంటరీ జనరల్ సెక్రెటరీ వినతి సతీష్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులయ్యారు. చంద్రగిరి మండలానికి రాష్ట్ర టిఎన్టియుసి ఆర్గనైజింగ్ సెక్రటరీ యువరాజుల నాయుడు, చిన్న గొట్టిగల్లు మండలానికి పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు దశరథ వాసు, పాకాల మండలానికి పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షుడు సి షణ్ముఖ రెడ్డి, రామచంద్రాపురం మండలానికి పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ బాలసుబ్రమణ్యం రాజు, తిరుపతి రూరల్ మండలానికి మాజీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేష్ యాదవ్, ఎర్రవారిపాలెం మండలానికి పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ హేమగిరి పరిశీలకులుగా నియమితులయ్యారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిశీలకుడుగా మల్లారపు రవిప్రకాష్ వ్యవహరిస్తున్నారు. అధనంగా రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును కొత్తగా నియోజక వర్గం పరిశీలకులుగా నియమించారు. జి డి నెల్లూరు మండలానికి బంగారు పాల్యం మాజీ ఎంపిపి ఎన్ పి జయప్రకాశ్, కార్వేటినగరం మండలానికి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, పాలసముద్రం మండలానికి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పెనుమూరు మండలానికి పార్లమెంటు ఉపాధ్యక్షుడు గంజి మాధవయ్య, ఎస్ ఆర్ పురం మండలానికి చుడా చైర్ పర్సన్ కటారి హేమలత, వెదురుకుప్పం మండల పరిశీలకునిగా కాణిపాకం ఆలయ మాజీ చైర్మన్ ఎం సురేంద్రబాబును నియమించారు.

