గంగానది నీటిని అమృతంగా మార్చే మౌని అమావాస్య
నేడే పవిత్రమైన మౌని అమావాస్య
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని భక్తులు నమ్ముతారు. ఇందువల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని, మోక్షం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం. అమావాస్య నాడు గంగానది భూమి మీదకు వచ్చిందని నమ్ముతారు. కావున గంగానదిలో స్నానం చేయటానికి మౌని అమావాస్యకు మించిన పవిత్రమైన రోజు లేదని నమ్ముతారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. నదుల్లో పవిత్రస్నానాలు చేస్తారు. రెండు లేదా ఎక్కువ నదులు కలిసేచోట స్నానం చేస్తే పవిత్రత పెరుగుతుంది. మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా,మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది.
మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని, అమ, వాస్యగా విడగొట్టవచ్చు. మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటం. అమ అంటే చీకటి. వాస్య అంటే కామం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని. చంద్ర దేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు 'మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు, అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.' శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధిచేసుకునే పవిత్రనదుల్లో స్నానం, మౌనంగా ఉండే సంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది భూమి మీదకు వచ్చిందని నమ్ముతారు. గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య పవిత్రమైన రోజు. కొంత మంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరభారతం వారు పాటించే క్యాలెండర్ లో మాఘమాసంలో వస్తుంది. సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడతారు. గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే, అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను పాటించవచ్చు. మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే మీ ఇంట్లో గంగానది నీళ్ళు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్ళకి జతచేసి, మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవుకోవాలి.'గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ,
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు'
పై మంత్రం భారత ఉపఖంఢంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని, తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది. అలాగే పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో ప్రజలు పూర్వీకులను గుర్తు చేసుకుని, వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ రోజు కొంత డబ్బును మీరు పేదలకు, అవసరమైనవారికి దానం చేయాలని పెద్దలు చెపుతారు. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు దానంగా ఇవ్వవచ్చును. గోచార గ్రహ స్థితి రిత్య శని ప్రభావంతో ఉన్నారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేసి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేస్తే, శుభం కలుగుతుందని నమ్మకం.
పై మంత్రం భారత ఉపఖంఢంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని, తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది. అలాగే పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో ప్రజలు పూర్వీకులను గుర్తు చేసుకుని, వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ రోజు కొంత డబ్బును మీరు పేదలకు, అవసరమైనవారికి దానం చేయాలని పెద్దలు చెపుతారు. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు దానంగా ఇవ్వవచ్చును. గోచార గ్రహ స్థితి రిత్య శని ప్రభావంతో ఉన్నారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేసి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేస్తే, శుభం కలుగుతుందని నమ్మకం.
పో రై గంగ 2 అమావాస్య