10, జనవరి 2025, శుక్రవారం

రూ.15 వేల పింఛన్లలో అనర్హులే ఎక్కువ

జిల్లాలో కొనసాగుతున్న పింఛన్ల పరిశీలన 

ఏడు మండలాల్లో పూర్తయిన పరిశీలన 

పరిశీలన చేస్తున్న నెల్లూరు, సిమ్స్ డాక్టర్ల బృందాలు

దివ్యాంగుల దృవీకరణ పత్రాల జారీకి బ్రేక్ 


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాల కారణంగా మంచాలకు, మూడు చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగుల పింఛన్ల పరిశీలనలో చిత్రవిచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి నాలుగు పింఛన్లలో ఒకటి మాత్రమే 15 వేల రూపాయలకు అర్హత ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన మూడు పెన్షన్లు వికలాంగుల కేటగిరీ కింద పెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా వారికి అనవసరంగా 15 వేల రూపాయలు ఇస్తున్నట్లు విచారణలో వెల్లడి అవుతోంది. ఇప్పటికీ జిల్లాలో గంగవరం, సోమల, చిత్తూరు మున్సిపాలిటీ, ఐరాల, రామకుప్పం మండలాల్లో పింఛన్లు తనిఖీ కార్యక్రమం పూర్తయింది. జిల్లాలో మొత్తం 1936 పింఛన్లు ఉండగా ఇప్పటివరకు 620 పింఛన్ల పరిశీలన పూర్తయింది పింఛన్ల పరిశీలనకు చిత్తూరు జిల్లాకు సంబంధం లేని తిరుపతి నెల్లూరు జిల్లాలకు సంబంధించిన డాక్టర్ల బృందాలు ఏర్పాటు చేశారు ఈ బృందాలు ఇంటింటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేసి లబ్ధిదారున్ని ఫోటోతోపాటు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం వికలాంగుల పరిశీలన పూర్తి అయ్యేవరకు కొత్తగా దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతానికి జిల్లాలో దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు జారీ ప్రక్రియకు బ్రేక్ పడింది.

 దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఇందుకు జిల్లా స్థాయిలో 10 డాక్టర్ల బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందాలు తొమ్మిది రోజుల్లో జిల్లాల్లో 15 వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తనిఖీ చేస్తున్నారు. రోజుకు 25 నుంచి 30 మంది పెన్షనర్ల వివరాలను యాప్ లో నమోదు చేస్తారు. జిల్లాలో  పక్షవాతం కారణంగా చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం అయిన వారు 1015 మంది,  తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధితులు 921 మంది పించన్లు తీసుకుంటున్నారు. వీరు  నెలకు రూ.15,000 పెన్షన్ అందుకుంటున్నారు. ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్స్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వీరిని వెరిఫికేషన్ చేస్తారు. రూ. 6,000 పెన్షన్ అందుకుంటున్న దివ్యాంగుల పెన్షనర్లకు వైద్య బృందం వెరిఫికేషన్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో నిర్వహిస్తారు. లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, దృష్టి లోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం, మల్లీపుల్ డిజిబులిటీ,  మల్టీడిఫార్మిటీ లెప్రసీ 35,277 మంది పెన్షనర్లు ఉన్నారు. ఆర్థోపెడిక్స్, సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేస్తారు. ప్రతి మెడికల్ టీంతో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌ను జిల్లా కలెక్టర్‌ జత చేస్తారు. జిల్లా స్థాయిలో షెడ్యూల్‌ను జిల్లా స్థాయి సమన్వయ కమిటీ రూపొందిస్తుంది. మండల, మున్సిపాలటీ స్థాయిల్లో షెడ్యూల్‌ను రూపొందిస్తారు. మెడికల్ టీంను కూడా జిల్లాస్థాయి సమన్వయ కమిటీనే నియమిస్తుంది. ఒక మెడికల్ టీం ప్రతి రోజు కనీసం 25 పెన్షనర్లను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా షెడ్యూల్‌ను తయారు చేసి, జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. తేదీల వారీగా ఆయా పెన్షనర్ల మ్యాపింగ్ జరిగేలా చూసుకోవల్సిన బాధ్యత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లదే. పెన్షన్స్‌ను మొబైల్ అప్లికేషన్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అయిన పెన్షన్లలలో 5 శాతం ర్యాండమ్‌గా వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఒక టీంను ఏర్పాటు చేస్తారు. ఇందులో కూడా అనర్హులు తీరితే ఆ టీంలోని డాక్టర్ల మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్లను పెంపు చేసింది. అందులోనూ దీర్ఘకాలిక వ్యాధులు, వికలాంగుల పెన్షన్లను భారీగా పెంచింది. నెలకు రూ.3000 ఉన్న వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచింది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు పెన్షన్ కూడా రూ.10,000 నుంచి రూ.15,000కు పెంచింది. భారీగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆయా కేటగిరీల్లో అనర్హత పెన్షన్ల ఎరివేతకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యేవరకూ కొత్త వికలాంగ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రంలో నకిలీ వికలాంగు ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండు మూడు నెలలు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అనర్హులు వికలాంగ పింఛన్లు తీసుకుంటున్నారని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ప్రాథమిక పరిశీలనలో ఈ విషయం నిర్ధారణ అయింది. దీంతో మొత్తం దివ్యాంగుల పింఛన్లను పరిశీలనచేసి, అర్హులను గుర్తించాలని ప్రభుత్వం ఈ మేరకు పరిశీలనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఆర్థిక సహాయం నిజమైన దివ్యాంగులకు మాత్రమే అందాలన్నది ప్రభుత్వ ధ్యేయం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *