3, నవంబర్ 2024, ఆదివారం

జిల్లాలో చురుగ్గా పశుగణన కార్యక్రమం

ఇంటింటికి వెళ్తున్న పశుసంవర్ధక శాఖ సిబ్బంది 

ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు,  గొర్రెలు, మేకల వివరాల నమోదు 

 పశుగణనకు సహకరించాలని జెడి వినతి 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లాలో పశుగణన కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని గత నెల 25వ తారీఖున బంగారు పల్లి మండలంలో గోపూజతో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. జిల్లాకు చెందిన వెటర్నరీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెంపుడు జంతువుల లెక్కలను నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న పశు సంపద లెక్కలను కచ్చితంగా సేకరించి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ లెక్కల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపదకు  అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి వీలవుతుంది. పశువులకు టీకాలు, దాణా ఇతర పథకాలను ఈ గణాంకాల ఆధారంగా అమలు చేస్తారు.


దేశంలో పశుసంపదపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకే కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ 21వ పశుగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రతి ఐదేళ్లకోసారి దేశంలో పశు సంపదను లెక్కించడం 1919 నుంచి జరుగుతున్నది. చిట్టచివరగా 2018లో 20వ పశుగణన నిర్వహించారు. ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు, జడల బర్రెలు, గొర్రెలు, మేకలు, పందులు, ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, కుందేళ్లు, ఏనుగులు వంటి 15 రకాల పెంపుడు పశువులు/ జంతువులతోపాటు నాటుకోళ్లు, పౌల్ర్టీ కోళ్లు, బాతులు, టర్కీ కోళ్లు, ఈము, నిప్పుకోడి (ఆస్ర్టిచ్‌) తదితర పక్షుల వివరాలను సేకరిస్తారు. ఈ ఏడాది అక్టోబరు 25వ తేదీన పశుగణను ప్రారంభించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీతో ముగిస్తారు. ఇందుకోసం జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు వెటర్నరీ, పారావెటర్నరీ సిబ్బందిని ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లుగా నియమించారు. వీరు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా జంతువులు, పక్షుల వివరాలతోపాటు పెంపకందారుల సమాచారాన్ని కూడా సేకరించి అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో పశుగణన ప్రక్రియను ఈ నెల 25వ తేదీన ప్రారంభించారు. వాస్తవంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పశుగణను ప్రారంభించాల్సి వుంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబరు 25వ తేదీకి వాయిదా పడింది. జిల్లాలో పశుపోషణపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగానాలుగు లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వ్యవసాయం భారంగా మారడంతో పలువురు రైతులు పంటల సాగుకు స్వస్తిచెప్పి, పాడి పశువుల పోషణ వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో పశువుల పెంపకందారులను ప్రోత్సహించేందుకు, భవిష్యత్తులో వారి ఆదాయాన్ని పెంచేందుకు, రుణాల మంజూరు, ఇతర పథకాల అమలు కోసం ప్రస్తుతం జరుగుతున్న పశుగణన ఎంతో దోహదపడుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. పశుగణన చేపట్టేందుకు జిల్లాలో  సూపర్‌వైజర్లను, ఎన్యూమరేటర్లను నియమించారు. వీరు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా పశువులు, జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తారు. ఇద్దరు సంయుక్త సంచాలకులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలో 2018లో జరిగిన పశుగణన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లాలో 5.4 లక్షల ఆవులు, 4,900 బర్రెలు, 52 లక్షల గొర్రెలు, 22 లక్షల మేకలు ఉన్నాయి. జిల్లాలో ఆవులు, బర్రెల ద్వారా  రోజుకు 11 లక్షలు లీటర్ల పాల దిగుబడి వస్తుంది. జిల్లాలో సంవత్సరానికి 11 లక్షల మెట్రిక్ టన్నుల పాలు, 66,000  మెట్రిక్ టన్నుల మాంసం, 11,900 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.   జిల్లాలో పశువుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక వెటర్నరీ పాలీ క్లినిక్, 14 ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు, ఆరు నియోజకవర్గస్థాయి వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, 68 వెటర్నరీ డిస్పెన్సరీలు, 77 రూలర్ లైవ్ స్టాక్ యూనిట్లు, 496 రైతు సేవ కేంద్రాలు తమ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 

*పశుగణన సర్వేకు సహకరించాలి*

పశుగణన సర్వే పక్కాగా సాగాలంటే ప్రజలు అన్ని విధాలా సహకరించాలి. గ్రామాలే కాకుండా పట్టణాలు, నగరాల్లో కూడా ఈ సర్వే జరుగుతుంది. వ్యక్తిగత నివాసాల్లో వుండే వారి నుంచి సమాచారం సేకరించడంలో పెద్దగా ఇబ్బంది వుండదు. అపార్టుమెంట్లలో వుండే వారు పశుగణన సిబ్బంది వచ్చినప్పుడు వారికి సహకరించి పూర్తి సమాచారం ఇవ్వాల్సి వుంటుంది. ఇలా ఇవ్వడం కారణంగా ప్రభుత్వానికి సరైన లెక్క తెలుస్తుంది. అందుకు తగిన విధంగా పశువుల అభివృద్దికి ప్రణాలికలను రూపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 

ఎం. ప్రభాకర్, జెడి పశుసంవర్ధక శాఖ  Ganga 2

Ganga 1 గుడిపాల మండలం చేర్లోపల్లిలో పశుగాననను పలిశిలిస్తున్న జెడి ప్రభాకర్ 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *