రైలు ఢీకొని కుల్లంపల్లి వ్యక్తి మృతి
రైలు ఢీకొని కుల్లంపల్లి వ్యక్తి మృతి
చిత్తూరు రైల్వేస్టేషన్లో సాయంత్రం రెండవ ప్లాట్ఫారం దాటుతూ ఉండగా కాట్పాడి ప్యాసింజర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఐరాల మండలం వైయస్ గెట్ కులం పల్లికి చెందిన 70 సంవత్సరాల వయసు కలిగిన బంగి ధనంజయ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం చిత్తూరు రైల్వేస్టేషన్లో రెండవ ప్లాట్ఫామ్ దాటుతూ ఉండగా కాట్పాడి ప్యాసింజర్ అతన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కోన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని కాపాడాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.