సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఇద్దరి అరెస్టు
సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఇద్దరి అరెస్టు
కన్సల్టెన్సీ పేరుతో సుమారు రూ.70 లక్షల వరకు మోసం చేసిన కేసులో మరో ఇద్దరిని చిత్తూరు క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ బలికి అమాయకులైన బి.టెక్ పూర్తిచేసిన విద్యార్థులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో సుమారు 70 లక్షల వరకు డబ్బులు కాజేసిన జి.అనిల్ కుమార్ రెడ్డి, శివ కుమార్ లను మార్చ్ నెల 10వ తేదీన అరెస్ట్ చేసిన విషయం విదితమే. మంగళవారం చిత్తూరు క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీ భాస్కర్, వారి సిబ్బందితో కలిసి చిత్తూరు లోని కట్టమంచి చెరువు సమీపాన ఉన్న వివేకానంద విగ్రహం దగ్గర ప్రధాన నిందితుడైన అనిల్ కుమార్ మిత్రులు 1.మహర్షి గౌతం, 25సం. మరియు 2. తిరుమల వరప్రసాద్, 29సం. లను ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేసారు.
కొర్లగుంట, తిరుపతి నందు నివాసముంటున్న సాయి శ్రీనివాస్ కు బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని అతని వద్ద నుండి డబ్బులు తీసుకొని అతనిని మోసం చేసాడని బాధితుడి ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి ఆదేశాలతో చిత్తూరు క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. ఈరోజు మరో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 4 ముద్దాయిలను చేసారు. వీరు దాదాపు 25 మందిని మోసం చేసినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రం లోనే కాకుండా పక్క రాష్ట్రం లో కూడా ఇతని బాధితులు ఉండటంతో దాని పై కూడా విచారణ చేస్తామని ఇటువంటి కన్సల్టెన్సీ లపై దృష్టి సారిస్తామని తెలియజేసారు. ఇలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని ఇప్పటికే ఏదైనా కన్సల్టెన్సీ చేతిలో మోసపోయిన వారు వెంటనే వారి సంబందింత పోలీస్ స్టేషన్ లో లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని కోరారు.