295 రూపాయలకే ఇంటర్ నెట్, కేబుల్ టివి
ఏపి ఫైబర్ నెట్ ద్వారా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక
35 లక్షల సెటప్ బాక్స్ ల కోసం కేంద్రానికి విజ్ఞప్తి
జిల్లాలో ముతపడనున్న ఎంఎస్ఓ లు
డిటిహెచ్ లకు తగ్గనున్న ప్రాధాన్యత
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
అతి తక్కువ ధరకు వినియోగదారులకు ఇంటర్నెట్, కేబుల్ టీవీ కనెక్షన్ ఇవ్వడానికి ఏపీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే 35 లక్షలు సెటప్ బాక్స్ లను సరఫరా చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సెటప్ బాక్స్ లు రాగానే దశలవారీగా రాష్ట్రం మొత్తం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కలెక్షన్లను అందజేయనుంది. ఇది ప్రారంభం అయితే, జిల్లా వ్యాప్తంగా కేబుల్ టీవీ నెట్వర్క్ లు ముతపదనున్నాయి. అలాగే డిటిహెచ్ చానళ్ళు తమ ప్రాధాన్యతను కోల్పోవనున్నాయి.
ప్రస్తుతం కేబుల్ నెట్ కు నెలకు రూ. 250 నుండి 300 చెల్లించాలి. అయినా లిమిటెడ్ టీవీ చానెళ్లు మాత్రమే వస్తాయి. ఇంటర్నెట్ కావాలంటే 400 నుండి 600 ఖర్చు పెట్టాలి. దీంతో సగటు కుటుంబానికి నెలకు రూ.900 కనీసం ఖర్చవుతుంది. కావున వినియోగదారునికి అదా చేయడానికి ఇంటర్అ నెట్దే, కేబుల్ నెట్ కలిపి తగ్గువ ధరకు ఇవ్వడానికి గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపి ఫైబర్ నెట్ ను తీసుకొనివచ్చింది. పట్టణాల్లో ఏపి ఫైబర్ నెట్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయి. కొందరికి ఇచ్చారు. ప్రభుత్వం మారడంతో ఏపి ఫైబర్ నెట్ అటక ఎక్కింది. కూటమి ప్రభుత్వం మళ్ళి ఇందుకు శ్రీకారం చుడుతోంది. రూ.300లోపే అన్ని టీవీ చానెళ్లూ, ఇంటర్నెట్ రెండూ అందిస్తే.. ఏ వినియోగదారుడైనా తప్పకుండా 300లోపు అన్నీ అందించే సంస్థకే మారుతాడని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం 295 రూపాయలకే ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 295కే టీవీచానెళ్లు, ఇంటర్నెట్ అందించనుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికీ అత్యంత చౌక ధరకే ఇంటర్నెట్, టీవీ చానెళ్లకు అందించడానికి గతంలో తీసుకొచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ని మరింత విస్తరించాలని కంకణం కట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఇళ్లకు తమ సేవలను అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇది అమలైతే రాష్ట్రంలో ప్రధాన ఎంఎస్ఓ లు, కేబుల్ టీవీ దాదాపు కనుమరుగు అవడం ఖాయం. దీంతో కేబుల్ టీవీ చానెళ్లలో పని చేసేవారు, కేబుల్ టీవీ రంగ కార్మికుల్లో ఆందోళన మొదలైంది. దీంతో గత కొంత కాలంగా తీవ్రంగా వినియోగదారులను నష్టపోతున్న కేబుల్ టీవీ సంస్థలు ఇప్పుడు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి తోడు ఈ ఏపీఫైబర్ నెట్ విస్తరిస్తే తమ మనుగడే ప్రశ్నార్థకం కానుందని ఆవేదన చెందుతోంది. దీంతో కొందరు ఎలాగైనా ఏపీ ఫైబర్ నెట్ను తమ నెట్ వర్క్ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తున్నారు. తమకు బాగా పట్టున్న విజయవాడ, నెల్లూరు, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర నగరాల్లో ఏపీ ఫైబర్ నెట్ సేవలు విస్తరించకుండా పలుకుబడి కలిగిన ఎంఎల్ఏలు, ఎంపీల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టాలని కసరత్తు చేస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ తమ నెట్ వర్క్ పరిధిలోకి సేవలను విస్తరిస్తే వెంటనే అందులోకి మారిపోవాలని కూడా కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా నష్టాల బాట పట్టిన సంస్థ కు చెందిన సీనియర్ ఉద్యోగులు అయితే తమ బాస్ ఈ పాటికే ఏపీఫైబర్నెట్ లోకి మారేందుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా చెబుతున్నారు. భారత్నెట్ ప్రాజెక్టును ఏపీలో విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్రం సాయం అందించాలని ఏపీ మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కోరారు. ఆయన ఇటీవల దిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ను ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శి సురేశ్కుమార్, ఏపీ ఫైబర్నెట్ ఎండీ కె. దినేష్కుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని సురేష్ కుమార్ కోరారు. భారత్ నెట్ సమర్ద వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రొటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన 650 కోట్ల రూపాయలు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 9.7 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాండ్ బాండ్ సేవలందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 5 లక్షల కనెక్షన్లు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు. తక్షణం 35 లక్షల సీపీఈ బాక్సులు అందిస్తే భారత్ నెట్ సేవలను మరింత విస్తృతపరుస్తామని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. భారత్ నెట్ ఫేజ్-3 ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని కేంద్రానికి అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 35 లక్షల సెటప్ బాక్స్ లను సరఫరా చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అన్ని పట్టణాల్లో ఏపి ఫైబర్ నెట్ ద్వారా తగ్గువ ధరకే కేబుల్, ఇంటర్ నెట్ కనెక్షన్లు ఇవ్వనుంది.
పో రై ఏపి ఫైబర్ నెట్ తారీఫ్