6, జూన్ 2024, గురువారం

కుప్పంలో 48 వేల ఓట్ల మెజారిటీతో చంద్రబాబు విజయం


నగరిలో 45 వేల ఓట్ల తేడాతో ఓడిన రోజా 

పుంగనురులో 6 వేల ఓట్లతో గట్టెక్కిన పెద్దిరెడ్డి 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

 చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 48,006 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు తర్వాత నగిరి నుంచి గాలి భాను ప్రకాష్ 45,006  ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు.. జిల్లాలో సర్వం తానై చక్రం తిప్పిన మంత్రి పెద్దిరెడ్డి 6,095 ఓట్లతో గట్టున పడ్డారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీని పదునైన విమర్శలతో ఇరుకున పెడుతున్న మరో మంత్రి ఆర్కే రోజా 45 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పుంగనూరు నుండి పోటి చేసిన బిసివై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రా యాదవ్ 4,559 ఓట్లు సాధించారు. పూతలపట్టు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసిన ఎం ఎల్ ఏ ఎం ఎస్ బాబు 2,820 ఓట్లతో సరిపెట్టుకున్నారు. చిత్తూరు జిల్లాలో గెలుపొందిన అభ్యర్థుల పొందిన ఓట్ల వివరాలు మెజారిటీ కింది విధంగా ఉన్నాయి

కుప్పం 

నారా చంద్రబాబు నాయుడు టిడిపి  1,21,929

కే ఆర్ జే భరత్ వైసిపి 73,923

మెజారిటి 48,006


పలమనేరు 

నూతనకాల్వ అమర్ నాధ రెడ్డి టిడిపి 1,23,232

వెంకటే గౌడ వైసిపి 1,03,110

మెజారిటి 20,122


చిత్తూరు 

గురుజాల జగన్మోహన్ నాయుడు టిడిపి 88,066

విజయానంద రెడ్డి వైసిపి 73,462

మెజారిటి 14,604


గంగాధర నెల్లూరు 

డాక్టర్ ఎం వి థామస్ టిడిపి 1,01,176

క్రుపాలక్ష్మి వైసిపి 75,165

మెజారిటి 26,011


పూతలపట్టు 

కే మురళి మోహన్ టిడిపి 1,02,137

సునీల్ కుమార్ వైసిపి 86,503

మెజారిటి  15,634


నగరి 

గాలి భానుప్రకాష్ టిడిపి 1,07,797

ఆర్ కే రోజా వైసిపి 62,793

మెజారిటీ 45,004


పుంగనూరు 

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి  వైసిపి  1,00,793

చల్లా రామచంద్రా రెడ్డి టిడిపి 94,698

మెజారిటి 6,095

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *