6, నవంబర్ 2025, గురువారం

పటిష్టమైన శక్తిగా బలపడనున్న తెలుగుదేశం పార్టీ

 సమన్వయ లోపంతో చతికిలపడనున్న వైసిపి 

మదనపల్లికి పెద్దిరెడ్డి, తిరుపతికి రోజా 

స్థానిక ఎన్నికల్లో సత్తా  చాటనున్న టిడిపి


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత చిత్తూరు జిల్లాలో టిడిపి ఎదురులేని శక్తిగా మారుతుందని భావిస్తున్నారు. వైసిపి నాయకత్వ లేమితో దిక్కులేని స్థితికి గిగజారుతుందని అంచనా వేస్తున్నారు. వైసీపీకి బలమైన నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజాలకు చిత్తూరు జిల్లాతో సంబంధాలు తగ్గిపోతాయి. గతంలో ఉద్దేశపూర్వకంగా పుంగనూరును చిత్తూరు జిల్లాలో కలిపి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన హవాను కొనసాగించారు. ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గం కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో కలవనుంది. అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న నగిరి నియోజకవర్గానికి చెందిన మండలాలు తిరుపతి జిల్లాలో విలీనం కానున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాలోని వైసీపీకి అంత బలమైన నాయకత్వం ఉండే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకి మాత్రం చిత్తూరు జిల్లాలో బలమైన నాయకత్వం ఉంది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మరింత బలిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది. వైసీపీ పార్టీకి సమన్వయం పెద్ద సమస్యగా తలెత్తే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా తెలుగుదేశం పార్టీ జిల్లాలో భారీగా లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ హవా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొత్తగా ప్రతిపాదిత జిల్లాలో కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, జి డి నెల్లూరు ఐదు నియోజక వర్గాలు ఉంటాయి. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజక వర్గాన్ని మదనపల్లె జిల్లాలో విలీనం చేస్తారు. నగరి నియోజక వర్గంలోని మూడు మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. వాటిని కూడా  తిరుపతిలో విలీనం చేస్తారు. దీనితో వైసిపిలో బలమైన నాయకుడైన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి నియోజక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఆర్ కె రోజా పక్క జిల్లాలకు పరిమితం కావలసి వస్తుంది. మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఆయన కుమార్తె కృపాలక్ష్మిసొంత పార్టీలోనే  తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పార్టీ చిత్తూరు ఇంచార్జి విజయనంద రెడ్డికి పార్టీలో పట్టు ఉన్నప్పటికీ బయటికి వచ్చి పోరాటం చేయలేరు. పలమనేరు ఇంచార్జి వెంకటే గౌడ్ బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు నియోజక వర్గానికి వచ్చి పోతుంటారు. కుప్పం ఇంచార్జి ఎమ్మెల్సీ భరత టిడిపి నేతలను సమర్థవంతంగా ఎదుర్కోలేరు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తన పని తాను చేసుకుని పోతున్నారు. మాజీ ఎంపి, మాజీ ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి ఎక్కువగా అమెరికాలో కూతుళ్ళ వద్ద ఉంటున్నారు. ఈ నేపద్యంలో 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి నేతలను సమర్థవంతంగా ఎదుర్కునే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక టిడిపికి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎనిమిది సార్లు వరుసగా గెలుపు సాధించారు. మరో బలమైన వ్యక్తి, మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కె మురళీ మోహన్, జి డి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ తొలి సారి గెలిచినప్పటికీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పట్టున్న మాజీ ఎమ్మెల్యే సి కె బాబు టిడిపిలో ఉన్నారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధులు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్ టివీ డిబేట్లలో సమర్థవంతంగా తమ వాణిని వినిపిస్తున్నారు. పైగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున టిడిపి నేతలు, కార్యకర్తలకు తిరుగు ఉండదని భావిస్తున్నారు. కాగా చంద్రబాబు నాయుడు జిల్లాకు చెందిన ఒకరిద్దరి పార్టీ రాష్ట్ర, జాతీయ కమిటీలో కీలక బాధ్యత అప్పగిస్తామని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే కటారి హేమలత చూడా చైర్ పర్సన్ గా ఉన్నారు. సి ఆర్ రాజన్ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు పార్లమెంటు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కుప్పంకు చెందిన మునిరత్నం ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. అమాస రాజశేఖర్ రెడ్డి కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిలో ఉన్నారు. మరి కొందరికి రాష్ట్ర,జిల్లా స్థాయి పదవులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *